ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగాను, ఇటు భారతదేశంలోనూ కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇప్పటికే మన దేశంలో మంగళవారం అప్డేట్స్ చూస్తుంటే 4500 క్రాస్ చేసి 5 వేలకు చేరువ అవుతోంది. ఇక ఇప్పటికే వరల్డ్ మీటర్ ప్రకారం కరోనా మరణాలు 136కు చేరుకున్నాయి. ఇక కరోనా లాక్ డౌన్ కొనసాగుతోన్న సమయంలో మన దేశంలో గర్భిణీలు పడుతోన్న బాధలు అన్నీ ఇన్నీ కావు. కరోనా సమయంలో పుడుతోన్న పిల్లల్లో చాలా మందికి కరోనా పేరు కలిసి వచ్చేలా పేర్లు పెడుతున్నారు. ఇక మరి కొందరు
తాజాగా కడప జిల్లా వేంపల్లె మండలంలో పుట్టిన పిల్లలకు కరోనా పేరు కలిసి వచ్చేలా పేర్లు పెట్టారు. వేంపల్లె మండలం అల్లిరెడ్డిపల్లికి చెందిన రమాదేవికి, తాళ్లపల్లికి చెందిన శశికళకు ఆడ, మగ పిల్లలు పుట్టారు. డాక్టర్ల సలహా మేరకు ఈ పిల్లలకు కరోనా కుమారి, కరోనా కుమార్ అనే పేర్లు పెట్టారు. ఇక గతంలోనే ప్రకృతి వైపరీత్యాలు వచ్చిన సమయాల్లోనూ, వైరస్ సమయాల్లో పుట్టిన పిల్లలకు ఇలాంటి పేర్లు పెట్టడం గతంలో కూడా జరిగింది.