ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా వాసుల‌ను ఇది నిజంగా శుభ‌వార్తే..  వారం రోజుల పాటు జిల్లా వాసుల‌ను క‌రోనా వైర‌స్ కంటిమీద కునుకులేకుండా  చేసింది. ఢిల్లీ నిజాముద్ధీన్‌, మ‌ర్క‌జ్ ఘ‌ట‌న త‌ర్వాత వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లా మిన‌హా, మిగ‌తా ఐదు జిల్లాల్లో క‌రోనా వైర‌స్ కోర‌లు చాసింది. ఆరు రోజుల్లోనే కొత్త‌గా 30 పాజిటివ్ కేసులు బ‌య‌ట‌ప‌డ్డాయి. దీంతో అప్ర‌మ‌త్తం అయిన ప్ర‌భుత్వం , ఆయా జిల్లాల యంత్రాంగం దిద్దుబాటు చ‌ర్య‌ల‌ను వేగ‌వంతం చేసింది. దీంతో ప‌రిస్థితి కొంత అదుపులోకి వ‌చ్చింది. గ‌డిచిన రెండు రోజులుగా కొత్త‌గా ఒక్క పాజిటివ్ కేసు కూడా న‌మోదుకాక‌పోవ‌డంతో యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. అయితే ఇప్పుడిప్పుడే ప‌రిస్థితి అదుపోల‌కి వ‌స్తున్నా.. ఏ ద‌శ‌లోనూ ఏమ‌రుపాటు ప‌నికిరాద‌ని అధికారులు సూచిస్తున్నారు. తాజా ప‌రిస్థితి ప్ర‌కారం.. జిల్లాలో 30 పాజిటివ్ కేసులు మిన‌హా, కొత్తగా న‌మోద‌య్యే అవ‌కాశం దాదాపు లేద‌ని వైద్య వ‌ర్గాలు వెల్ల‌డించాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: