ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్‌లో తబ్లిగ్ జమాత్ సమావేశం నిర్వహించిన జమాత్ చీఫ్ మౌలానా ముహమ్మద్ సాద్ ఆచూకీ దొరికింది. దేశ వ్యాప్తంగా ఈ కరోనా వైరస్ ప్రబలేందుకు కారణమైన తాబ్లిగ్ జమాత్ చీఫ్ సాద్‌పై పోలీసులు కేసు న‌మోదు చేయడంతో ఆయన పరారయ్యారు.ఢిల్లీ, యూపీలోని ముజఫర్ నగర్, షామ్లీ ప్రాంతాల్లో మౌలానా ముహమ్మద్ సాద్ కోసం ఢిల్లీ క్రైంబ్రాంచ్ పోలీసులు తీవ్రంగా గాలించారు. ఎట్టకేలకు మౌలానా ముహమ్మద్ సాద్ ఆచూకీని ఢిల్లీ క్రైంబ్రాంచ్ పోలీసులు బుధవారం కనుగొన్నారు. ఢిల్లీలోని జాకీర్ నగర్ లోని తన నివాసంలో మౌలానా సాద్ క్వారంటైన్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కరోనా మహమ్మారి దేశంలో వేగంగా వ్యాపిస్తున్న తరుణంలో జమాత్ సమావేశాన్ని రద్దు చేయాలని పలువురు ఇస్లామిక్ మతాధికారులు సూచించినా... మౌలానా సాద్ వినలేదు. దీంతో జమాత్ సమావేశం నిర్వహించడంతో వేల మంది సభ్యులు ఆరోగ్యం ప్రమాదం పడినట్లయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: