కరోనా వైరస్ నాశనం అయిపోవాలంటూ మహబూబాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మృత్యుజయ హోమం నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని అయ్యప్పస్వామి దేవాలయంలో శంకర్ నాయక్ దంపతులు కరోనా నివారణ హోమం, అభిషేకాలు నిర్వహించారు. అంతకుముందు వేద పండితులు ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. కరోనా మహమ్మారి బెడద పోవాలని, దేశం సమూలంగా కరోనా నుంచి విముక్తి కావాలంటూ వేదపండితులు హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సత్యవతి రాథోడ్ హాజరుకావడం గమనార్హం.
హోమం అనంతరం ఎమ్మెల్యే శంకర్నాయక్ మాట్లాడుతూ ప్రపంచం మొత్తం కరోనా విపత్తుతో అల్లాడిపోతోందని ఎమ్మెల్యే శంకర్నాయక్ తెలిపారు. అయితే మహబూబాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని తన ఇష్ట దైవమైన అయ్యప్పస్వామి ఆలయంలో పూజలు చేసినట్లు పేర్కొన్నారు. యాగం చేయడం వల్ల మంచి జరుగుతుందన్న నమ్మకంతో వేద పండితుల సూచన మేరకు ఈ బృహత్కార్యం చేపట్టామని పేర్కొన్నారు.
ఇటీవల తిరుమలలో కూడా కరోనా నివారణ కోసం ధన్వంతరి మహాయాగం నిర్వహించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఎలాంటి భయంగానీ, ఉపద్రవాలు గానీ, ప్రకృతి వైపరీత్యాలు గానీ, మహావ్యాధులు గానీ ప్రబలినప్పుడు శ్రీవారికి శాంతి ఉత్సవాలు చేపడతారు. మూడు రోజుల పాటు ఈ యాగాన్ని నిర్వహించారు. శ్రీనివాసమూర్తిని, ధన్వంతరి మూర్తికి యాగం చేసి పూర్ణాహుతి చేపట్టారు. రాష్ట్రంలో ఏ ఒక్కురూ కూడా ఆకలితో అలమటించకూడదూ అనేదే ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయమన్నారు. అందుకే తన శాయశక్తలా పేదలకు సాయం చేస్తూ వెళ్తున్నానని పేర్కొన్నారు. శంకర్నాయక్ యాగం చేపట్టడంపై ఆ పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple