ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో కరోనా వైరస్ చాపకింద నీరులా  విజృంభిస్తుంది. రోజు రోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి. ఇందులో ఎక్కువ శాతం ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారే అని బాగా అర్థమవుతుంది. తాజాగా  తెలంగాణ రాష్ట్రంలో 49 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలియజేయడం జరిగింది. దీనితో ప్రస్తుతం తెలంగాణలో 453 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. అలాగే ఇందులో 45 మంది వరకు కరోనా వైరస్ బారినుండి తప్పించుకోగా 11 మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 397 మందికి ట్రీట్మెంట్ అందిస్తున్నామని ఈటెల తెలియజేశారు. వీళ్ళ అందరికీ సాధారణమైన ట్రీట్మెంట్ అందజేస్తున్నామని ఎవరికి కూడా వెంటిలేటర్ల మీద లేరు అని తెలియజేయడం జరిగింది.. అలాగే దీనితోపాటు విదేశాల నుంచి వచ్చిన వారందరూ కూడా  ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉన్నారని ఈటెల ప్రకటించారు.. వీరందరూ క్షేమంగా ఉండడంతో రేపు వారిని డిస్చార్జ్ ఇస్తామని స్పష్టంగా తెలియజేశారు. 

 

 


అంతేకాకుండా కరోనా వైరస్ ఆస్పత్రులలో అన్ని రకాల సదుపాయాలు కల్పించడం జరిగిందని అన్నారు. వీటితో పాటు వైద్యులకు కావాల్సిన పరికరాలు, రక్షణ కిట్లు అన్నీ కూడా వాళ్లకు అందజేశామని తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం మన రాష్ట్రంలో 80 వేలకు పైగా పర్సనల్ ప్రొటెక్షన్ ఎగ్రిమెంట్ కిట్లు ఉన్నాయని.. ఇంకో 5 లక్షల కిట్లకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది అని ఈటెల రాజేందర్ అన్నారు. అలాగే రక్షణ కోసం N-95 మాస్క్ లు 5 లక్షల, రెండు కోట్ల సర్జికల్ మాస్కులు, ఐదు లక్షల గాగుల్స్  కూడా  ఆర్డర్ ఇచ్చాము అని మంత్రి ఈటల తెలిపారు. అత్యవసర పరిస్థితిలో ఏదైనా అవసరమైతే ప్రత్యేక విమానం ద్వారా కిట్లను తెప్పిస్తామని తెలియజేయడం జరిగింది.

 

 


ఇప్పటి వరకు మార్కెట్ కు వెళ్ళి వచ్చిన వారిలో 1100 మందికి వైద్య పరీక్షలు నిర్వహించామని అని తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా వీరితో కాంటాక్ట్ అయినవారు 3158 మందిని క్వారెంటన్ లో ఉంచామని కూడా తెలిపారు. అలాగే డాక్టర్లకు కావలసిన అన్ని రకాల సదుపాయాలు కూడా కల్పిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు మొత్తం రాష్ట్రంలో 22 ప్రైవేట్ మెడికల్ కాలేజీలను కరోనా వైరస్ హాస్పిటల్ గా పని చేస్తున్నాయని మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: