ఇప్పటి కే  ప్రపంచాన్ని కది లించి వేసిన ఈ కరోనా వైరస్ మహమ్మారి ప్రజల ను అను క్షణం భయ పడేలా చేస్తుంది. అంతే కాక దేశ వ్యాప్తం గా పాకుతూ వస్తుంది. అయితే ఈ మహమ్మారి ని ఆది లోనే త్రుంచివేయాల ని ప్రభుత్వం కట్టు దిద్దమయిన చర్యల ను  చేపడుతూ వస్తుంది. ఈ మేరకు లాక్ డౌన్ ను ప్రకటించారు. ఇకపోతే దేశ వ్యాప్తం గా లాక్ డౌన్ కొన సాగుతుంది..ఏప్రిల్ 14 తర్వాత కూడా లాక్ డౌన్ ను పొడిగించనున్నట్లు తెలుస్తుంది.. 

 

 


కరోనా  ప్రభావం రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది కరోనా నియంత్రణ లో భాగంగా ప్రజలందరూ  ఇళ్ల లోనే ఉండా లని ప్రభుత్వం పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే..అందులో భాగం గా లాక్ డౌన్ ను విధించింది..ఈ మేరకు కొందరు ప్రజలు మద్దతు తెలుపుతూ ఇళ్లకే పరిమితమయ్యారు.. కొందరేమో ప్రభుత్వ నియమాల ను ఉల్లంఘిస్తూ బయట తిరుగుతున్నారు.. అలాంటి వారికి కరోనా పై  పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు..

 

 

 

నెల్లూరు జిల్లాలో కరోనా ప్రభావం అధికం గా ఉన్నందువల్ల, నిత్యావసరాల కొరకు వచ్చే ప్రజలు ఎక్కువ సమయం బయట గడపొద్దంటూ వింజమూరు ఎస్.ఐ బాజిరెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా వింజమూరు శివారు తండాలో కె.జి.ఆర్.వి.యస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. 

 

 


ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత లాక్ డౌన్ సమయంలో తండాలలో ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు గానూ దాతలు సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని అన్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు జిల్లా ప్రజలు సహకరించాలని ఎస్ఐ బాజిరెడ్డి విజ్ఞప్తి చేశారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని, తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: