ఓ వైపు దేశం మొత్తం కరోనా భయంతో లాక్ డౌన్ చేస్తే.. మరోవైపు కొంత మంది కామాంధులు మాత్రం అత్యాచారాలకు తెగబడుతూనే ఉన్నారు.  దేశం ఇప్పుడు అసలే కష్టకాలంలో ఉందని తెలిసినా.. కామాంధులు మాత్రం నిస్సిగ్గుగా రెచ్చిపోతూనే ఉన్నారు. తాజాగా జమ్మూకశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో మూడేళ్ల చిన్నారిపై పక్కింటి యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.  రాంబన్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన మూడేళ్ల చిన్నారి పై పక్కింటి యువకుడు పవన్ సింగ్(18) చాక్లెట్లు ఇస్తానని చెప్పిన తన ఇంట్లోకి తీసుకెళ్లాడు.

 

ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఆ చిన్నారిపై లైంగిక దాడికి తెగబడ్డాడు. అయితే ఆ చిన్నారి గట్టిగా ఏడ్వడం  విన్న తల్లి వెంటనే అతడి ఇంటికి రాగా నిందితుడు పరారయ్యాడు.  చిన్నారి జననాంగాల వద్ద రక్తస్రావం కావడంతో ఆమె స్థానికుల సాయంతో వెంటనే ఆస్పత్రికి తరలించింది. కాగా, ఆ చిన్నారి అత్యాచారానికి గురైందని డాక్టర్లు తెలిపారు. దాంతో తల్లిదండ్రులు  పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 

ఈ నేపథ్యంలో  పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకుని నిందితుడు పవన్ సింగ్‌ను అరెస్ట్ చేశారు. ఆ దుర్మార్గుడికి కఠిన శిక్ష విధించాలని గ్రామస్తులు కోరుతున్నారు. గతంలో తెలంగాణలో ఓ యువకుడు నెలల పసిపాపపై అత్యాచారానికి వడి కట్టి గొంతు నులిమి చంపాడు..ఆ దుర్మార్గుడికి ఉరిశిక్ష విధించిన విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: