ప్రస్తుతం ఎక్కడ చూసినా కరోనా..కరోనా... రోజురోజుకి మనదేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య బాగా పెరిగిపోతోంది. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఈ మహమ్మారిని అరికట్టేందుకు లాక్ డౌన్ విధానాన్ని అమల్లోకి తీసుకొని రావడం జరిగింది. ఇది ఇలావుండగా మరోవైపు కామాంధులు నేరాలకు పాల్పడుతున్నారు. నిజానికి ఇలాంటి వారికీ ఎన్ని కొత్త చట్టాలు తెచ్చిన వరికి బుద్ది రాదు. ఒక్కొక్కరిది ఒక్కో దారి ఈ మూర్ఖులది. 

 


ఇక పూర్తి వివరాల్లోకి వెళితే... యూపీలోని ఘజియబాద్ లో రాధే శ్యామ్ తన భార్య కుమారి తో కలిసి జీవనం కొనసాగిస్తున్నాడు. ఇక రాధే శ్యామ్ చెడు వ్యసనాలకు అలవాటుపడి అప్పుల ఊబిలో పడ్డాడు. అప్పులు తీర్చలేక చాలా ఇబ్బందులు పడ్డాడు. ఏమీ తోచని స్థితిలో తన స్నేహితుడు అయిన కౌశల్ కుమార్ ను సహాయం అడిగాడు. ఇదిలా ఉండగా దుర్మార్గుడైన స్నేహితుడు రాధే శ్యామ్ భార్య మీద కన్ను వేయడం జరిగింది. దీనితో కౌశల్ ఆమెతో తనకు శారీరిక సుఖం కల్పిస్తే  నీ అప్పులన్నీ నేను తీరుస్తానని చెప్పాడు. 

 


అంతే కాకుండా వాడి మాయమాటలతో రాధే శ్యామ్ ను ఒప్పించాడు. ఇక కౌశల్ చెప్పిన మాటలకు రాధే శ్యామ్ గుడ్డిగా ఒప్పుకోవడం జరిగింది. ఇటీవల కౌశల్ కుమార్ ఒంటరిగా ఉన్న రాధే శ్యామ్ భార్యను తన కోరిక తీర్చమని బలవంతం చేయడం జరిగింది. దీనితో బాధితురాలు ఆ ప్రాంతం నుంచి తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. దీనితో పోలీసులు వెంటనే రంగంలోకి దిగి నిందితుల ఇద్దరిని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. ఇంకా పూర్తి వివరాల కోసం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిజానికి ఇలాంటి పనికమాలిన వారు ఇలాంటి పనులతో వారు ఇబ్బందులు పడడమే కాకుండా వారితో జీవనం సాగిస్తున్నవారు కూడా ఇబ్బందులు పడవలిసి వస్తుంది. ఇలాంటి వారిని నిజానికి ఏ శిక్షలు వేసిన తప్పులేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: