కరోనా కారణంగా దేశం లో లాక్ డౌన్ లు లాక్ డౌన్ కారణంగా ఎన్నో ఇబ్బందులు . ముఖ్యంగా చుక్కలేనిదే నిద్రపట్టని మందుబాబులు పిచ్చ్చి పట్టిన వారిలా ప్రవర్తిస్తున్నారు. చివరికి చంపడాకి లేదా చావడానికి కూడా వెనుకాడటం లేదు . లాక్ డౌన్ కారణంగా మద్యం దొరక్క ఓ మందు బాబు సొంత భార్యను విసింగించడం మొదలు పెట్టాడు అంతటితో ఆగకుండా ఆమెను అనుమానించాడు విసుగుచెందిన ఆ మహిళా మూర్తి భర్తను కడతేర్చిన సంఘటన  మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా మేడ్చల్‌ మండలం రాజబొల్లారం పంచాయతీ లో జరిగింది . 

వివరాలలోకి వెళితే మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా మేడ్చల్‌ మండలం రాజబొల్లారం పంచాయతీకి చెందిన వ్యక్తి(35) వెల్డర్‌గా పనిచేస్తున్నాడు. తాగుడుకు బానిసైన అతను లాక్ డౌన్ కారణం గా ఇంట్లోనే ఉంటూ తాగడానికి డబ్బులు లేక తన భార్యను వేదించసాగాడు . విసుగు చెందిన ఆమె గురువారం తెల్లవారుజామున నిద్రలో ఉన్న అతన్ని ఇస్త్రీ పెట్టెతో దాడి చేసి దాని వైరును మెడకు బిగించి హత్య చేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు , ఈ కేసు పై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు . అదేవిధంగా ఆమె ఒక్కటే ఈ హత్య చేసిందా లేక ఎవరైనా ఆమెకు సహకరించారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు  

మరింత సమాచారం తెలుసుకోండి: