కరోనా రక్కసి కోరలకు చిక్కుకు పోయి యావత్ భారతావని విలవిలా లాడుతూ ఉంది. మర్కజ్ నిజాముద్దీన్ ప్రార్థనల అనంతరం కరోనా వ్యాప్తి నానాటికి పెరిగి పోతోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలను పట్టి పీడిస్తోంది . నిన్నటి వరకు ఏపీలో 363 కేసులు నమోదుకాగా ఆరుగురు చనిపోయారు. గడచినా 24 గంటలలో 890 మందికి కరోనా పరీక్షలు జరపగా అందులో 17 కరోనా కేసులు నమోదు కావడం జరిగింది . కొత్తగా వచ్చిన మొత్తం రెండు కేసులతో కలిపి 19 కేసులు గడచిన 24 గంటలలో నమోదు జరిగాయి .
అదేవిధంగా మొన్న గుంటూరు జిల్లా నర్సారావు పేటలో ఓ కేబుల్ ఆపరేటర్ కరొనతో చనిపోగా అతను సర్వీస్ చేసిన ప్రాంతాలన్నింటినీ రెడ్ జోన్ లు గా ప్రకటించారు ఏపీ ప్రభుత్వం . ఏపీ లో ఇప్పటి వరకు 143 హాట్ స్పాట్లను గుర్తించడం జరిగింది . దీనితో ఏపీ లో సెక్యూరిటీని కట్టుదిట్టం చేసారు