భారీగా ప్రజల మద్దతుతో జగన్ సీఎం అయిన దగ్గర నుంచి ఆయనని కష్టాలు వెంటాడుతూనే ఉన్న విషయం తెలిసిందే. గత ఐదేళ్లు చంద్రబాబు విచ్చలవిడిగా అప్పులు చేసి, జగన్ నెత్తిన పెట్టి వెళ్లిపోయారు. దీంతో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి మరింత ఇబ్బందుల్లో పడిపోయింది. అయితే ఆర్ధిక పరిస్థితి బాగోకపోయిన సీఎం జగన్ మాత్రం ప్రజలకు అండగా నిలవడంలో ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. ఊహించని విధంగా అనేక పథకాలు ప్రజలకు అందించారు.

 

ఇక నిదానంగా ఆర్ధిక వనరులు పెంచుకునే సమయంలో కరోనా మహమ్మారి గట్టి దెబ్బవేసింది. ఊహించని విధంగా కరోనా వైరస్ ఎటాక్ చేయడంతో రాష్ట్రం లాక్ డౌన్ లోకి వెళ్ళిపోయింది.  ఆదాయం వచ్చే అన్నిదారులు మూసుకుపోయాయి. అయినా జగన్ వెనక్కి తగ్గకుండా ప్రజలకు అండగా ఉంటున్నారు. కరోనా వ్యాప్తి ప్రబలకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రం మొత్తం ఆరోగ్య సర్వే చేయిస్తున్నారు. అటు లాక్ డౌన్ వల్ల పేదలు ఇబ్బందులు పడకుండా చూసుకుంటున్నారు.

 

ఇప్పటికే ఉచిత రేషన్, రూ. 1000 పేద ప్రజలకు అందించారు. అయితే ఇంకా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ పొడిగించేందుకు చూస్తున్నారు. ఈ లాక్ డౌన్ మరిన్ని రోజులు పెరిగితే ఏపీ ఆర్ధిక పరిస్థితి మరింత దారుణంగా తయారై పరిస్థితి నెలకొంది. అయితే ఆర్ధిక పరిస్థితి ఎలా ఉన్నా, ప్రజల ఆరోగ్యమే ముఖ్యంగా జగన్ ముందుకెళుతున్నారు. అయితే ఇలా ఓ వైపు కరోనా వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుంటే మరోవైపు అకాల వర్షాలు మరింత దెబ్బవేశాయి. రైతులు పండించిన పంటలని అకాల వర్షాలు, ఈదురుగాలులు ముంచేసాయి. ర్రాష్ట్రంలో వరి, మామిడితోటలు, మొక్కజొన్న, ఎండుమిర్చి, కూరగాయ పంటలని దారుణంగా నష్టపరిచాయి.

 

ఇక ఇలా రైతులకు ఒక్కసారిగా ఇబ్బందులు రావడంతో జగన్ వెంటనే స్పందించారు. వెంటనే పంట నష్టంపై ఎన్యుమరేషన్‌ను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలని, నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని అధికారులని ఆదేశించారు. అలాగే పిడుగుపాటుకు మరణించిన వారికి 24 గంటల్లోగా ఎక్స్‌గ్రేషియా అందించాలని చెప్పారు. ఏదేమైనా ఎన్ని కష్టాలు వచ్చినా.. జగన్ వెంటనే స్పందిస్తూ ప్రజలని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: