ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజు రోజుకి బాగా పెరిగిపోతున్నాయి. ఇందుకు పరిష్కారంగా ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా కూడా ప్రజలు మాత్రం వారికి ఇష్టం వచ్చినట్లు బయటకు రావడం జరుగుతుంది. లాక్ డౌన్ విధానాన్ని అమల్లోకి తీసుకొని వచ్చినా సరే జనాలు మాత్రం మారడం లేదు. ఇలా చేయడంతో ఇప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా తెలంగాణలో చాలా కట్టడి చేసినా సరే ప్రజలు మాత్రం ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తుండడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

 


ఇంకొక అదృష్టమైన విషయం ఏమిటి అంటే కేవలం ఆసుపత్రులలో క్వారంటైన్ లో ఉన్న వారికి మాత్రమే కరోనా వ్యాప్తి చెందుతుంది. ఇది ఒక అదృష్టమైన విషయం అనే చెప్పాలి. ఏది ఏమైనా కానీ జనాలు మాత్రం వారికి తగు జాగ్రత్తలు పాటించటం లేదు అనే చెప్పాలి. వారికి తోచిన సమయంలో రోడ్ల మీదకు వస్తున్నారు. అంతే కాకుండా చికెన్ షాపుల వద్ద సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయకుండా బారులు తీరుతున్నారు. ఈ తరుణంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవాలని ముందడుగు వేస్తుంది. ఇక అసలు విషయానికి వస్తే చికెన్ షాపులన్నీ కూడా బందు చేయడం. కాకపోతే వారికి కాస్త సమయం కేటాయించటం అన్న నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిపింది. ఈ విషయంపై ఇప్పటికే డీజీపీతో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

 


చికెన్ షాపుల వద్ద జనాలు భారీగా ఉండటంపై తీవ్ర ఇబ్బందులు వస్తున్న తరుణంలో కెసిఆర్ సర్కార్ వాళ్లకు కట్టడి చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది ఏమిటి అన్న విషయానికి వస్తే ఏ చికెన్ షాపు వద్ద అయినా కానీ పది మంది కంటే ఎక్కువగా ఉండకూడదు. అంతేకాకుండా ఆ పదిమంది కూడా సోషల్ డిస్టెన్స్ పాటించక పోతే మాత్రం చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. అంతేకాదు ఈ చర్యలు కఠినంగా తీసుకోకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని సీఎం కేసీఆర్ పోలీస్ అధికారులకు చేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: