తెలుగు దేశం అధినేత చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్ పై ప‌ప్పు అంటూ ముద్ర వేసే ప్రయత్నంలో బాగా జరిగింది. దానికి తోడు లోకేశ్ ప్రవర్తన కూడా అలాగే ఉండటంతో ఆ విమర్శలకు మరింత బలం చేకూరేది. ఏదేమైనా ఆయనపై పప్పు అన్న ముద్ర బాగా పడిపోయింది. చివరకు రామ్ గోపాల్ వర్మ తన కమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమాలో కూడా నారా లోకేశ్ పాత్రను పప్పుతో ఆటాడుకున్నారు.

 

 

తాజాగా మరోసారి లోకేశ్ ప్రవర్తన పప్పు తరహాలోనే ఉందన్న విమర్శలు వస్తున్నాయి. అసలు ఇంతకూ విషయం ఏంటంటే.. కరోనా విషయంలో తెలుగుదేశం పార్టీ లాక్ డౌన్ పొడిగించాలని చెబుతోంది. ఈ మేరకు ఇటీవల జరిగిన పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలోనూ ఇదే నిర్ణయించారు. ఈ మేరకు ఆ పార్టీ ఓ లేఖను ముఖ్యమంత్రి జగన్ కు కూడా పంపింది. అంటే పార్టీ పరంగా తెలుగు దేశం లాక్ డౌన్‌ను అంగీకరిస్తున్నట్టే కదా.

 

 

కానీ చంద్రబాబు లాక్ డౌన్ పొడిగింతకు మద్దతు ఇస్తుంటే.. ఆయన కుమారుడు.. పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మాత్రం లాక్ డౌన్ పొడిగిస్తే ఎలా.. పేద ప్రజలు ఏమైపోవాలి అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కరోనా ప్రభావంతో పేద ప్రజలు అల్లాడుతుంటే.. లాక్ డౌన్ పొడగింపు వార్తలు వారిని మరింత ఆందోళనలోకి నెడుతున్నాయని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తన పోస్టుల్లో ఆవేదన వ్యక్తం చేశారు.

 

 

లాక్ డౌన్ వల్ల పేద ప్రజలు పనులు లేక, తినడానికి తిండి లేక, ఎక్కడికీ కదల్లేని దుర్భర జీవితం గడుపుతున్నారని లోకేశ్ అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అప్పు పుట్టే అవకాశం కూడా లేనందున సమస్యల సుడిగుండంలో ఇరుక్కున్న పేద కుటుంబాలను ముఖ్యమంత్రి జగన్ ఆదుకోవాలని లోకేశ్ కోరారు. వారికి తక్షణమే రూ.5 వేలు ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారట. పేదలను ఆదుకోవాలని కోరడంలో న్యాయం ఉంది. కానీ లాక్‌డౌన్‌ పొడిగింపును వ్యతిరేకిస్తే ఎలా లోకేశూ అంటున్నారు విశ్లేషకులు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: