కరోనా వైరస్ నియంత్రణకై ప్రస్తుతం భారత్ లో లాక్ డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ లాక్ డౌన్ సమయంలో చాలావరకు అంటే 60 శాతం వరుకు క్రైమ్ రేట్ తగ్గింది. ఎక్కడో ఇంట్లో మగ కొవ్వు ఎక్కిన మగవాళ్ళు మాత్రమే ఇంట్లోని ఆడవారిని టార్చర్ చేస్తున్నారు. ఒక ఇంట్లో తప్ప బయట దాదాపు క్రైమ్ తగ్గిపోయింది. 

 

అత్యాచారాల సంఖ్య కూడా గమణియంగా తగ్గింది. అయితే ఇంకా ఈ నేపథ్యంలోనే ఓ ఆడపిల్ల తండ్రి చేసిన ఘటన తెలుసుకుంటే వెన్నులో వణుకు పుడుతుంది. ఆ ఘటన అలా ఉంది. ఆ ఆడపిల్ల వయసు కేవలం ఏడు రోజులు.. చంపేద్దాం అనుకున్నాడో తెలీదు.. ఎవరికి తెలీకుండా పడేయాలని అనుకున్నాడో తెలీదు.. ఆ ఏడు రోజుల శిశువును చేతి సంచిలో వేసుకొని పట్టుకెళ్తున్నాడు. 

 

ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.. దీంతో అతన్ని పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. అయితే ఎందుకు ఆ పసికందును అలా తీసుకెళ్తున్నావ్ అని అతన్ని పోలీసులు ప్రశ్నించగా అసలు పొంతనలేని సమాధానాలు చెప్పాడు. దీంతో ఆ పసికందును స్వాధీనం చేసుకున్న పోలీసులు తల్లి వద్దకు తీసుకెళ్లారు. అయితే పాపను తీసుకెళ్లిన విషయం ఆమెకు తెలియదని, పాపను ఎం చెయ్యడానికి తీసుకెళ్లాడో అని ఆమె ఆందోళన చెందింది. 

 

దీంతో పసికందును తల్లికి అప్పగించి అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకెళ్లారు. అయితే ఈ దారుణమైన ఘటన తూర్పుగోదావరి జిల్లా దొడవాక గ్రామంలో జరిగింది.. ఆ కసాయి తండ్రి ఎందుకు చేశాడో తెలీదు కానీ ఈ ఘటన తలుచుకుంటే ఇంకా ఇలాంటి ముర్కులు ఉన్నారా అని అనిపిస్తుంది. 

 

                                   

మరింత సమాచారం తెలుసుకోండి: