దేశంలో  ఏ దుర్మూహూర్తంలో కరోనా ప్రవేవించిందో కానీ కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది.  ప్రతిరోజూ కరోనా కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి.. మరణాలు కూడా పెరుగుతున్నాయి.  భారత్‌లో 24 గంటల్లో 909 కేసులు నమోదయ్యాయి. కొన్ని రోజులుగా భారత్‌లో భారీ సంఖ్యలో కేసులు నమోదు అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా కేసుల మొత్తం సంఖ్య 8,356కు చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది.  మహారాష్ట్రలో ఇప్పటివరకు అత్యధికంగా 1761 మంది ఈ వైరస్ బారిన పడ్డారు. 127 మంది ప్రాణాలు కోల్పోయారు.

 

ఆ తర్వాత ఢిల్లీలో 1069 మందికి కరోనా సోకగా వారిలో 19 మంది మృతి చెందారు. తమిళనాడులో 969 మందికి కరోనా సోకగా, వారిలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు.  లాక్ డౌన్ పాటిస్తున్నా ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. ఈ కరోనాని మాత్రం తన ప్రతాపాన్ని చూపిస్తూనే ఉంది.  24 గంటల్లో దేశంలో 34 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 7,367 మంది కరోనా బాధితులు చికిత్స తీసుకుంటున్నారని తెలిపింది. 716 మంది కోలుకున్నారు. 273 మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది.

 

ఉత్తరప్రదేశ్‌లో 452 మందికి కరోనా సోకింది. వారిలో 45 మంది కోలుకోగా, ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మధ్యప్రదేశ్‌లో 532, తెలంగాణలో 504, గుజరాత్‌లో 432, ఆంధ్రప్రదేశ్‌లో 381, కేరళలో 364 మందికి కరోనా సోకింది. ఛత్తీస్‌గఢ్‌లో 19 మందికి, జమ్మూకశ్మీర్‌లో 207 మందికి, లఢక్‌లో 15 మందికి కరోనా సోకింది.   

 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: