రాష్ట్రంలో కరోనా ప్రభావం ఎంత ఎక్కువగా ఉందో రాజకీయ నాయకులు కూడా అంతే రేంజ్ లో విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా జనసేన నేత, నటుడు నాగబాబు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మీద సంచలన వ్యాఖ్యలు చేసారు. ఒకరకంగా ఇది సందేశం వార్ అని చెప్పచ్చు.

 

ముందుగా విజయ సాయి పవన్ ని ఉద్దేశించి చేసిన ఒక సందేశానికి నాగబాబు స్పందించాడు. మీరు మా ఇంటికి వచ్చింది 2014 లో కాదు 2019 లో ఎలక్షన్స్ కి ముందు. మన కామన్ ఫ్రెండ్ ద్వారా వచ్చారు.. మేము సాధారణ మైన వ్యక్తులం. మాకు సినిమాలు టీవీ షో లు చేయకుంటే కుటుంబాలు పోషించలేము.

 

మీకు ఆ అవసరం లేదనుకోండి మంది సొమ్ము బాగా మెక్కారు గా. ఇంకో 1000 ఇయర్స్ కాలు మీద కాలు వేసుకొని హాయిగా దొంగ లెక్కలు వేసుకొంటు, దోచుకుంటు బ్రతికెయ్యగలరని మాకు తెలుసు. అవార్డ్స్ అందుకోగల పారిశ్రామిక వేత్తలని జైలు పాలు చేసింది తమరి ప్రతిభే కదా.. చిన్న విషయం మీరు వైస్సార్ ఆడిటర్ కాకపోయివుంటే శత కోటి గొట్టంగాళ్లలో ఒక గొట్టంగాడని వదిలేసి వాడిని వద్దు సాయి ఈ కరోన టైంలో అంటూ సందేశం పంపాడు. 

 

దానికి సాయి రెడ్డి ఏమో పావలా బ్యాచికి రోషం పొడుచుకొచ్చింది. సిన్మాలు, టీవీ షోలు చేసుకుంటూ పార్టీని గాలి కొదిలి నోళ్లకు రాజకీయాలెందుకు? 2014లోనే  మేం పొత్తులు పెట్టుకోలేదు. పొత్తులుండవని పార్టీ అధినేత జగన్ గారు మా విధానాన్ని స్పష్టంగా ప్రకటించారు.

 

చిరంజీవి గారి తమ్ముళ్లు కాకపోతే కుక్కలు కూడా మొరగవంటూ ఆయన ఘాటుగానే స్పందించారు. దానికి నాగబాబు కూడా అదే స్థాయిలో స్పందించారు. నీలాంటి గొట్టంగాళ్ళు నాతో సందేశం పంపే బదులు ,ఫ్యూచర్ లో జైల్లో ఏలా టైం పాస్ చెయ్యాలి అని ఒక డే టు డే షెడ్యూల్ వేసుకో,టైం కలిసి వస్తుందని నాగబాబు పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: