అమ్మ, పిల్లల అనుబంధం ఎవరు చెప్పలేనంతగా ఉంటుంది. కానీ ఈ కసాయి తల్లి చేసిన పనికి అమ్మతనానికే మాయని మచ్చగా మిగిలిపోతుందని. పిల్లలను కంటికి రెప్పలగా కాపాడవలసిన తల్లి వాళ్ల పాలిట శాపంగా మారింది. ఏకంగా ఐదుగురు పిల్లలను అమానుషంగా నీళ్ళల్లోకి తోసేసింది. ఐదుగురు పిల్లలను నదిలోకి పడేసి అతి క్రూరంగా ప్రవర్తించింది. తన పిల్లలు నదిలో కొట్టుకుపోతున్నా సరే చలనం లేకుండా తల్లి విశ్లేషిస్తుంది. ఈ దారుణమైన ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది.

 


ఇక వివరాల్లోకి వెళితే... ఉత్తరప్రదేశ్ లోని బదోహి ప్రాంతానికి చెందిన మృదుల్ యాదవ్, మంజు యాదవ్ వీరి ఇద్దరి మధ్య సంవత్సరం నుంచి వివాదాలు కొనసాగుతున్నాయి. ఎప్పుడూ గొడవలు ఉండడంతో భార్య మంజు యాదవ్ తన పిల్లలు ఐదుగురిని చంపేయాలని నిర్ణయం తీసుకుంది. పిల్లలందరినీ గంగానదిలో వదిలేసి అంతమొందించాలని నిర్ణయం తీసుకొని నది ఒడ్డునకు వెళ్ళింది. జహంగీరాబాద్ వద్ద ఉన్న గంగానది ఘాట్ దగ్గర కన్న పిల్లలని మమకారం లేకుండా ఐదుగురి పిల్లలని గంగా నదిలోకి తోసేసింది. పిల్లలు అందరూ కూడా నదిలో మునుగుతూ కేకలు వేస్తున్నా సరే... ఏమాత్రం కనికరం లేకుండా అలా చూస్తూ నిల్చుంది. 

 


ఈ సంఘటన చూసిన మత్స్యకారులు ముందుకు వచ్చి సహాయం కూడా చేయలేకపోయారు. కన్నబిడ్డలు అలా అవుతున్న కానీ... వేడుక చూస్తున్న తల్లిని చూసి ఆమె మంత్రగత్తె అయి ఉండొచ్చని భయపడి మత్యకారులు అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీస్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. ఇక అప్పటికే నదిలో గల్లంతైన చిన్నారుల కోసం గాలింపులు జరుగుతున్నాయని ఎస్పి రమ్ బడన్ సింగ్ తెలియజేయడం జరిగింది. ఏది ఏమైనా ఇలాంటి కసాయి తల్లి ఎవరికి ఉండక పోవచ్చు. మొత్తంగా కన్నమమకారం కూడా లేకుండా తన ఐదుగురు బిడ్డలు ఆర్తి, సరస్వతి, మాతేశ్వరి, శివ్‌ శంకర్, కేశవ్ ప్రసాద్‌ లను గంగలోకి తోసేయం నిజంగా అమానుషంగా సంఘటన.

మరింత సమాచారం తెలుసుకోండి: