గత కొంత కాలంగా ఏపిలో రాజకీయ వేడి ఏ రేంజ్ లో రాజుకుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి వల్ల నానా అవస్థలు పడుతున్నారు. ఈ సమయంలో ఏపి సీఎం ప్రతిరోజూ అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నారు. ఈ సమయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు అధికార ప్రభుత్వంపై సెటైర్లు వేయడం... విమర్శలు చేయడం చేస్తున్నారు.
అధికారులు, వాలింటైర్ల పనితీరు పై విమర్శలు జల్లుతున్నారు.ఈ విషయంపై వైసీపీ నేత ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు పై ట్విట్టర్ వేధికగా ఫైర్ అయ్యారు. పెద్ద నోట్ల రద్దు సలహా తనే మోదీకి ఇచ్చానని అప్పట్లో డప్పుకొట్టుకున్నాడు. క్రెడిట్ కొట్టేయాలని చూసినా ప్రధాని హుందాతనంతో వదిలేశాడు.3జోన్ల పద్ధతి ప్రవేశ పెట్టాలని ఎప్పుడో లేఖ రాశాడట. ఉదయం ఫోన్ వస్తే 4 గంటలు ఓపిక పట్టలేనోడు,లేఖ విషయం ఇన్నాళ్లు దాచాడంటే అది బోగస్ అని తెలుస్తూనే ఉంది అని విమర్శించారు.
మోదీ గారికి నచ్చచెప్పి అమెరికాకు క్లోరోక్విన్ ట్యాబ్లెట్లు పంపిందెవరు? ఆర్మీని దించక పోతే కరోనాతో పోతారని పుతిన్ ను హెచ్చరించిందెవరు? బ్రిటిష్ ప్రధానికి కరోనా వచ్చిందని డాక్టర్లకు చెప్పిందెవరు? నోట్: ప్రతి కొత్త ఆలోచన వెనక ఉన్నది ‘ఆయనే’ అని చదువుకోవాలి. లేకపోతే బతక నివ్వడు!
— Vijayasai reddy v (@VSReddy_MP) April 15, 2020
పెద్ద నోట్ల రద్దు సలహా తనే మోదీకి ఇచ్చానని అప్పట్లో డప్పుకొట్టుకున్నాడు. క్రెడిట్ కొట్టేయాలని చూసినా ప్రధాని హుందాతనంతో వదిలేశాడు.3జోన్ల పద్ధతి ప్రవేశ పెట్టాలని ఎప్పుడో లేఖ రాశాడట. ఉదయం ఫోన్ వస్తే 4 గంటలు ఓపిక పట్టలేనోడు,లేఖ విషయం ఇన్నాళ్లు దాచాడంటే అది బోగస్ అని తెలుస్తూనే ఉంది.
— Vijayasai reddy v (@VSReddy_MP) April 15, 2020
ఏం మొహం పెట్టుకుని ఏపికి వస్తాడు. మోదీ గో బ్యాక్ అని ఫ్లెక్సీలు కట్టించిన విషయం ప్రజలిప్పటికీ గుర్తుపెట్టుకున్నారు. వ్యక్తిగత విషయాలపై నీచంగా ఆరోపణలు చేసిన సంగతి మోదీగారు మర్చిపోయుంటాడని అనుకుంటున్నాడు. ఆయనది అపార జ్ఞాపకశక్తి. అయినా ప్రజలు తిరస్కరించిన వాడిని ఎవరూ ఆదరించరు.
— Vijayasai reddy v (@VSReddy_MP) April 15, 2020
ప్రధాని మోదీ పారిశుద్ధ్య కార్మికులతో, నర్సింగ్ సిస్టర్లతో, కరోనా నుంచి కోలుకున్న వారితో కూడా మాట్లాడారు. నిత్యం ఎంతో మందికి ఫోన్లు చేసి ప్రశంసిస్తారు. పరామర్శిస్తారు. ఆయన వినమ్రత అది. పాతికసార్లు ప్రాధేయ పడితే కాల్ చేసి ఉంటారు. దాన్ని కూడా రాజకీయాలకు వాడుకుంటే నవ్వొస్తోంది.
— Vijayasai reddy v (@VSReddy_MP) April 15, 2020