ఒకవైపు దేశంలో కరోనా వైరస్ పుణ్యమా అని మే 3 వరకు లాక్ డౌన్ జరుగుతోంది. ఒకవైపు పరిస్థితి ఇలా ఉంటే మరోవైపు మహిళలపై నేరాలు కొనసాగుతూనే ఉన్నాయి. లాక్ డౌన్ ఒకవైపు జరుగుతున్న కొందరు కామాంధులు వారి కామవాంఛతో మహిళలపై వేధింపులకు పాల్పడుతున్నారు. అయితే తాజాగా ఒక మహిళ స్నానం చేస్తుండగా ఆ సమయంలో డ్రోన్ కెమెరాలతో వీడియో తీసి బెదిరించిన ఇంజనీరింగ్ స్టూడెంట్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో జరిగింది.

 


ఇక పూర్తి వివరాల్లోకి వస్తే తమిళనాడు రాష్ట్రంలోని రామనాథపురం జిల్లా పుదుమఠంకు చెందిన శివకుమార్ ఈ పని చేశాడు. శివకుమార్ ప్రస్తుతం బీటెక్ చదువుతున్నాడు. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా కాలేజీకి సెలవులు ప్రకటించడంతో కొద్ది రోజులుగా అతను ఇంట్లోనే ఉంటున్నాడు. అయితే ఇదే క్రమంలో తన పక్క ఇంట్లో ఉన్న వివాహితపై అతని కన్నుపడింది. ఆమెను ఎలాగైనా లొంగదీసుకోవాలని ఆమెతో లైంగిక వాంఛ తీర్చుకోవాలని అతను భావించాడు. ఇదే క్రమంలో రోజు ఆమెని గమనిస్తూ ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా అని ఎదురు చూడగా తన ఇంజనీరింగ్ తెలివితేటలు ఉపయోగించి డ్రోన్ కెమెరా సిద్ధం చేసుకున్నాడు.  అంతే ఆ మహిళ స్నానానికి వెళ్ళినప్పుడు డ్రోన్ సహాయంతో ఆ వీడియోని తీశాడు.

 


ఆ తర్వాత ఆమె వాట్సాప్ నెంబర్ ని ఎలాగోలాగా తెలుసుకొని తాను తీసిన వీడియోని పంపించి వేధింపులకు గురిచేశాడు. దానితో తన కామ కోరికలు తీర్చకపోతే ఆ వీడియోను సోషల్ మీడియాలో పెడతానని చెప్పి బెదిరించడంతో బాధితురాలు ఆ విషయాన్ని తన భర్తకు తెలియజేసింది. దీనితో సదరు మహిళ భర్త పోలీసులకు ఫిర్యాదు చేయగా శివకుమార్ పై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే విచారణలో భాగంగా పోలీసులకు నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. అదేమిటంటే శివకుమార్ ఇంతకుముందు కూడా ఇలాగే వీడియోలు తీసి మహిళలను వేధించినట్టు కనుగొన్నారు. అది కూడా ఏకంగా 50 మందిని ఇదే విధంగా వేధించినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. దీనితో అతన్ని అరెస్ట్ చేసి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: