కర్ణాటక రాష్ట్ర మాజీ సీఎం హెచ్డి కుమారస్వామి తనయుడు యాక్టర్ నిఖిల్ కుమారస్వామి తన ఫియాన్సీ రేవతిని ఈ రోజు వివాహం చేసుకున్నాడు. పెళ్లి కూతురు అయిన రేవతి కాంగ్రెస్ నేత ఎం. కృష్ణప్ప యొక్క కుమార్తె. బెంగళూరులోని రామనగర్ ప్రాంతంలోని ఫామ్ హౌజ్ లోని బహిరంగ ప్రదేశంలో నిఖిల్ కుమారస్వామి రేవతిని పెళ్లి చేసుకున్నాడు.


అయితే ప్రస్తుతం భారతదేశం అంతటా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందనే ఉద్దేశంతో పెళ్లి కార్యక్రమాలు జరగకూడదని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఆదేశించినప్పటికీ... మాజీ ప్రధానమంత్రి హెచ్.డి.దేవెగౌడ... తన మనవడి పెళ్లి ఘనంగా జరిపించాడు. అయితే ఈ పెళ్లికి 30 కార్లలో 60-70 మంది వి.విఐపిలు హాజరైనట్టు పోలీసు అధికారులు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నుండి ముందస్తుగానే పర్మిషన్ తీసుకున్నానని తెలిపారు.


బి.ఎస్.యడ్యూరప్ప మాట్లాడుతూ... ఈ పెళ్లి మండపంలో ప్రతి ఒక్కరూ భౌతిక దూరాన్ని పాటించేలా మేము చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. అలాగే సంబంధిత అధికారులతో ఈ పెళ్ళి తతంగం మొత్తం వీడియో రికార్డు చేయించి... ఎవరైతే భౌతిక దూరాన్ని పాటించరో వారిపై చర్యలు తప్పకుండా తీసుకుంటామని కర్ణాటక డిప్యూటీ సీఎం సిఎన్ అశ్వత్ నారాయ తెలిపారు. యాక్టర్ నిఖిల్ రేవతి తో ఫిబ్రవరి 10వ తేదీన నిశ్చితార్థం జరుపుకున్నాడు. అయితే లాక్ డౌన్ కారణంగా తమ పెళ్లి వేడుకను ముందస్తుగా అనుకున్నట్టు జరుపుకోలేకపోయారు.


ఇకపోతే కర్ణాటక రాష్ట్రంలో 75 నుంచి 100 మంది బంధుమిత్రుల సమక్షంలో ఎవరైనా పెళ్లి చేసుకోవచ్చని మార్చి 22వ తేదీన కర్ణాటక సీఎం యడ్డ్యూరప్ప వెల్లడించారు. కర్ణాటక రాష్ట్రం లో ఈరోజు కొత్తగా 36 కేసులు నమోదు కాగా ఇప్పటివరకు మొత్తం 315 కి కరోనా బాధితుల సంఖ్య చేరింది. తాజాగా ఒకరు కరోనా వ్యాధితో చనిపోగా మొత్తం మరణాల సంఖ్య 13 చేరుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: