దేవుడా అనే మాట ఇప్పుడు వినపడటం లేదు .. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వినపడుతున్న ఒకే ఒక్క పేరు కరోనా .. ప్రజలందరూ ఈ మహమ్మారిని ఎదుర్కోవాలని ఏకం కావాలని అందరూ సూచించారు..అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ను విధించింది.. అయితే ప్రజలు ఎవరి ఇళ్లలోనే వారు ఉండాలని సూచించారు.. కరోనా పై పోరాటానికి ప్రజలు సిద్దం కావాలని సినీ ప్రముఖులు ఉత్తేజ పరుస్తున్నారు.. వీడియోల ద్వారా జాగ్రత్తలు తెలిపితే మరీ కొందరు మాత్రం రకరకాలా వీడియో నుపొస్ట్ చేస్తూ అభిమానులకు కావలసిన ఉత్తేజాన్ని కలిగించే ప్రయత్నం చేస్తున్నారు..
ఈ సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమలోని చాలా మంది సెలెబ్రెటీలు ప్రజలకు సేవ చేసేందుకు ముందుకొస్తున్నారు.. పలుగురు విరాళాలను అందిస్తున్నారు.. మరికొంత మంది స్వయంగా వచ్చి ప్రజలకు కావలసిన అత్యవసర నిత్యావసర వస్తువులను అందజేస్తున్నారు.. ఇకపోతే కరోనా మహమ్మారి ను కూకటి వేళ్ళతో పెకలించి వేయడానికి ప్రజలను ప్రభుత్వం సిద్దం చేస్తోంది..
అందులో భాగంగా లాక్ డౌన్ ను విధించింది..కరోనా ను తరిమికొట్టడానికి మోదీ ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తోంది..కరోనా నియంత్రణలో భాగంగా లాక్ డౌన్ అమలులోకి తీసుకొచ్చారు.. అందులో భాగంగా ప్రజలు ఇళ్లకే పరిమితం అవ్వడంతో అన్నీ రంగాలు స్వచ్చందంగా మూతపడ్డాయి..ఈ మేరకు ప్రజలను కరోనా పై అవగాహన కల్పించేందుకు ఒక్కొక్కరు ఒక్కో విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు..
అనంతపురం జిల్లా ధర్మవరం లో పెళ్లి వాయిదా పడిందని యువతి ఆత్మహత్య చేసుకుంది..ఒక వైపు కరోనా ప్రభావం.. మరోక వైపు ఆర్థిక సమస్యల కారణంగా మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్య కు పాల్పడింది..ఏప్రిల్ 26 న జరగవలసిన పెళ్లి లాక్ డౌన్ కారణంగా వాయిదా పడటంతో ఇంక పెళ్లి కాదని మస్తాపానికి గురైన యువతి ఉరి వేసుకుంది.. ప్రస్తుతం ఈ ఘటన కలకలం రేపుతోంది..