ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి పెరిగిపోతున్న విషయం తెలిసిందే. చైనాలోని పుహాన్ లో పుట్టుకొచ్చిన కరోనా ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా 205 దేశాల్లో వ్యాప్తి చెందింది. అయితే కరోనా వల్ల చైనా తర్వాత ఇటలీ, ఫ్రాన్స్, బ్రిటన్ తర్వాత అమెరికాలో విపరీతమైన మరణాలు, కేసులు పెరిగిపోయాయి. అమెరికాలో కరోనా కరాళ నృత్యం చేస్తుంది. లాక్ డౌన్ విధించిన కారణంగా కటింగ్ షాపులు మూతపడ్డాయి. దీంతో కొందరు కటింగ్ పెరిగిపోతోందని ఆందోళన చెందుతున్నారు. దయచేసి కొన్ని రోజులపాటు షాపులు తెరవాలంటూ విజ్ఞప్తులు చేస్తున్నారు.
తాజాగా మంత్రి కేటీఆర్ కు మరో యువకుడు తన భార్య కటింగ్ చేస్తానంటుందని అది జరిగితే లాక్ డౌన్ ఎత్తేసినా బయట తిరగలేనని విన్నవించుకున్నారు. ఇదిలా ఉంటే.. అమెరికాలో నమోదైన కరోనా కేసుల్లో 50శాతం కరోనా కేసులు బార్బర్ షాపుల వల్లే వచ్చాయంట. బార్బర్ షాప్ లో టవల్, రేజర్, బ్రష్, కుర్చీ మొదలైనవి చాలా మంది ఉపయోగిస్తారు.
వారిలో ఒక్కరికి కరోనా ఉన్నా అది అందరికీ సోకుతుందట. పరిస్థితి సాధారణ స్థితికి వచ్చిన తర్వాత కూడా ఈ కరోనా ముప్పు ఉంటుంది. అందుకే కరోనా వైరస్ తగ్గిన తర్వాత లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత షాప్ కి వెళ్తే బెటర్ అంటున్నారు. ఒకవేళ బాగా పరిచయం ఉన్న బార్బర్ ను ఇంటికి పిలిపించుకుని మన టవల్ వాడుతూ కటింగ్ చేయించుకోవడం ఉత్తమం.
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple