దేశంలో కరోనా ఏ రేంజ్ లో విస్తరిస్తుందో అందరికీ తెలిసిందే. అయితే ఈ కరోనాని కట్టడి చేయడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేస్తున్నారు. గత నెల 24 నుంచి లాక్ డౌన్ చేపట్టిన విషయం తెలిసిందే. కరోనా వ్యాప్తి గత నెల నిజాముద్దీన్ మర్కజ్ ప్రార్థనలో పాల్గొన్న వారి వల్లే వస్తుందని అంటున్నారు. ఆ మద్య విదేశాల నుంచి వచ్చిన వారి వల్ల వచ్చిందని అన్నారు.. ఇప్పుడు మర్కజ్ ప్రార్ధన కు వెళ్లి వచ్చిన వారి వల్ల ఎక్కువ అయ్యాయి. ఢిల్లీలో ఒకే కుటుంబంలో 31 మందికి కరోనా సోకింది.
ఢిల్లీలోని జహంగీర్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ ఏప్రిల్ 8న మరణించింది. అనుమానం వచ్చిన డాక్టర్లు ఆమెకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆమెకు కరోనా పరీక్షలు నిర్వహించారు.. దాంతో ఆమెకు కరోనా పాజిటీవ్ అని తేలింది. వారి కుటుంబీకులైన 26 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది.
తాజాగా మరో ఐదుగురు కుటుంబీకులకు లక్షణాలు కనిపిండంతో మళ్లీ పరీక్షలు నిర్వహించారు. వారికీ పాజిటివ్ వచ్చింది. దీంతో ఒకే కుటుంబంలోని 31 మందికి కరోనా వచ్చింది. వైద్యులు వారికి సేవలు చేస్తున్నారు.
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple