ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ కావాలని చైనా దేశం వ్యూహన్ ల్యాబ్ నుండే దురుద్దేశంతో ప్రపంచం మీదకి వదిలింది అని వార్తలు బలంగా వినబడుతున్నాయి. ఈ విషయాన్ని ముందుగా ఇజ్రాయెల్ దేశం ఇంటెలిజెన్స్ వర్గాల ప్రముఖ అధికారి ఆరోపించడం జరిగింది. ప్రపంచంలో ఈ వైరస్ రాకముందే ఇటువంటి ఆరోపణలు రావడంతో ఈ విషయం ప్రపంచ వ్యాప్తంగా పెద్ద హైలెట్ అయింది. దీంతో ప్రస్తుతం ఈ వైరస్ ప్రపంచంలో 200 దేశాలకు పైగా వ్యాపించి ఉండటం తో పాటుగా అనేకమంది చనిపోవడంతో చైనా పై చాలా దేశాలు డేగకన్ను వేశాయి. ముఖ్యంగా కరోనా వైరస్ వల్ల ప్రపంచంలో ఎక్కువగా నష్టపోయింది అగ్రరాజ్యం అమెరికా దేశం.

 

ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఈ వైరస్ గురించి మాట్లాడిన ప్రతి సారి...చైనా వైరస్ అని అభివర్ణిస్తూ మాట్లాడటం జరిగింది. అంతేకాకుండా డోనాల్డ్ ట్రంప్ కూడా చైనా దేశం కావాలని కరోనా వైరస్ ని వ్యూహన్ ల్యాబ్ నుండే విడుదల చేసినట్లు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచంలో అనేక మంది చావులకు కారణమైన చైనాపై భారతదేశానికి సంబంధించిన ఒక లాయర్ అంతర్జాతీయ కోర్టులో కరోనా వైరస్ విషయంలో డ్రాగన్ కంట్రీ ని దోషిగా చూపెడుతూ పిటిషన్ దాఖలు చేయటం మనకందరికీ తెలిసినదే.

 

అయితే ఇప్పుడు ఇదే ధోరణిలో యూరప్ మరియు ఈ వైరస్ వల్ల చనిపోయిన దేశాల ప్రధానులు కూడా తమ దేశంలో ఉన్న ప్రముఖ లాయర్ల చేత అంతర్జాతీయ కోర్టులో చైనా పై కేసు పెట్టడానికి రెడీ అవుతున్నాయట. దీంతో ప్రపంచవ్యాప్తంగా విదేశీ లాయర్లు కూడా కేసు వేస్తే నేరం రుజువైతే చైనా చాప్టర్ క్లోజ్ అని అంతర్జాతీయ స్థాయిలో వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే చైనా దేశం ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఏకాకి అయిపోయిందని… ఏ మాత్రం వ్యాక్సిన్ వచ్చి ఇది చైనా చేసిన కుట్ర అని తెలిస్తే… ప్రపంచ పటంలో చైనా దేశం కనబడకపోయినా ఆశ్చర్యపోనవసరం లేదన్న వార్తలు మరోపక్క వినబడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: