హైదరాబాద్లో ఉన్నారా? ఈ విషయం మీకు తెలిసి ఉండాల్సింది. నగరంలో లాక్డౌన్ మరింత కఠినంగా అమలవుతున్నదని, అనవసరంగా ఎవరూ రోడ్లపైకి రావద్దని సీపీ అంజనీకుమార్ సూచించారు. ఒక సారి బయటికి వస్తే నాలుగు రోజులకు సరిపడా నిత్యావసర సరుకులను తీసుకెళ్లాలని.. పదే పదే బయటికి వస్తే కఠిన చర్యలు తప్పవని సైబరాబాద్ సీపీ హెచ్చరించారు. పాసులు తీసుకున్న వారు వాటిని దుర్వినియోగం చేస్తే...అక్కడే దాన్ని రద్దు చేసి వాహనాన్ని సీజ్ చేస్తామన్నారు. ఐటీ సెల్ ఆధ్వర్యంలో ఈ పాసులను అందుబాటులోకి తెచ్చామని...అవసరమైనవారు హైదరాబాద్ పోలీస్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. క్యూఆర్ కోడ్తో ఉండే పాసులు కావడంతో కలర్లో ఉన్నా, బ్లాక్ అండ్ వైట్లో ఉన్న ఎలాంటి సమస్యా ఉండదన్నారు. నగరంలో 2 వేల మంది సిబ్బంది 24 గంటలు పనిచేస్తున్నారని... వారికి కావాల్సిన శానిటైజర్లు, మాస్క్లు, వ్యక్తిగత రక్షణ కిట్లను అందజేశామన్నారు. నగరంలో 124 కంటైన్మెంట్ జోన్లు ప్రస్తుతం కొనసాగుతున్నాయని సీపీ వివరించారు.
స్పెషల్ డ్రైవ్తో తనిఖీలు ముమ్మరం చేసి ఉల్లంఘనదారులపై కఠినంగా ఉంటామన్నారు. మొదటి దశలో లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించినందుకు 10 వేల వాహనాలు సీజ్, 3 లక్షల వాహనదారులకు ట్రాఫిక్ ఈ చలాన్లు జారీ, 1200 కేసులను నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈ సారి చర్యలు మరింత కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. ప్రజలు ఇండ్లలోనే ఉండి కరోనా కట్టడికి సహకరించాలని సూచించారు. దీని కోసం ప్రత్యేక లాక్డౌన్ బృందాలను ఏర్పాటు చేసి.. రోడ్లపై పెట్రోలింగ్ను పెంచుతామని తెలిపారు. సీజ్ అయిన వాహనం...తిరిగి మీ చేతికి చట్టపరంగా రావాలంటే కచ్చితంగా ఆరు నెలలు పడుతుందన్నారు. అన్ని చెక్పోస్టులను కట్టుదిట్టం చేయడంతో పాటు ఎవరినీ అనుమతించబోమని సీపీ తెలిపారు. నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు. నగరంలో 130 చెక్పోస్టులున్నాయని.. వీటి సంఖ్యను పరిస్థితులను బట్టి పెంచుతామన్నారు. దీని కోసం ప్రత్యేక లాక్డౌన్ బృందాలను ఏర్పాటు చేసి.. రోడ్లపై పెట్రోలింగ్ను పెంచుతామని తెలిపారు. సీజ్ అయిన వాహనం... తిరిగి మీ చేతికి చట్టపరంగా రావాలంటే కచ్చితంగా ఆరు నెలలు పడుతుందన్నారు. అన్ని చెక్పోస్టులను కట్టుదిట్టం చేయడంతో పాటు ఎవరినీ అనుమతించబోమని సీపీ తెలిపారు. నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు.