ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు అన్న విషయం తెలిసిందే. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని అమితంగా అభిమానిస్తూ ఉంటారు అనిల్ కుమార్ యాదవ్. అందుకే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఎవరు ఏ చిన్న విమర్శ చేసిన వారిపై విరుచుకు పడుతూ  విమర్శలు చేస్తూ ఉంటారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దూకుడు రాజకీయాలకు మారుపేరుగా ఉంటారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్. ప్రతిపక్ష ప్ నాయకుల పై విమర్శలు చేయడమే కాదు... ఉగ్రరూపం దాలుస్తూ  విరుచుకుపడుతూ ఉంటారు. అందుకే అనిల్ కుమార్ యాదవ్ పై ప్రతి విమర్శలు చేయడానికి చాలామంది ప్రతిపక్ష నాయకులు వెనుకడుగు వేస్తుంటారు. 

 

 తనదైన శైలిలో ప్రతిపక్షాలపై విరుచుకుపడుతూ ... ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్. ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఎక్కువగా కనిపించే అధికార పార్టీ నేతల మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఒకరు. ఎప్పుడూ జగన్ వెన్నంటే ఉంటూ జగన్ అడుగుజాడల్లో నడుస్తూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడుతూ ఉంటారు. ఇదిలా ఉంటే రాజకీయ నాయకులు పలుమార్లు కొన్ని వ్యాఖ్యలు చేసి పొరపాటున మీడియాకు దొరికి పోతు  ఉంటారు అన్న విషయం తెలుసిందే . ప్రస్తుతం ఇలాంటివి సర్వ సాధారణంగా జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా మీడియాకు అడ్డంగా దొరికిపోయారు. 

 

 ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా  వైరస్ విజృంబిస్తున్న  విషయం తెలిసిందే. అయితే తాజాగా కరోనా వైరస్ పై స్పందించిన ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సాయం అందించేవారు ఫోటో లకు దూరంగా ఉండాలి అంటూ సూచించారు. తాను కూడా వాటి జోలికి పోవడం లేదు అంటూ తెలిపారు. కానీ తర్వాత రోజే అలా సాయం చేస్తూ ఫోటోలు దిగారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్. ఇప్పుడు దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది . టిడిపి నాయకులు కేవలం పబ్లిసిటీ కోసం మాత్రమే ప్రజలకు సాయం చేస్తున్నారు అంటూ విమర్శించిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తాను మాత్రం పార్టీలకు దూరంగా ఉంటానని చెప్పి.. తర్వాత రోజు తాను కూడా ఈ ఫొటోలో దర్శనమివ్వడంతో నెటిజన్లు అనిల్ కుమార్ యాదవ్ పై సెటైర్లు వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: