టీనేజి లోని  అమ్మాయిలు,  అబ్బాయిలు ప్రేమ లో పడటం చాలా ఎక్కువ... ఆ వేడి వయసు లో ఎన్నో తప్పులను చేసి మరి కోరికలను తీర్చు కుంటున్నారు. అందుకె యుక్త వయసు లోనే జీవితాల ను సాగిస్తుంటారు. ఐక పోతే కొందరు తప్పు మంచిలకు తేడా లేకుండా మోసపోతుంటారు. ఇక్కడ ఓ యువతీ మోసపోయని గ్రహించడంతో యువకుడు ఆమె ఎక్కడ పరువు తీస్తుందోనని భయపడి ప్రాణాలను తీసుకున్నాడు. 

 

 

 

ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ప్రేమించిన యువతిని కాదని మరో యువతిని పెళ్లి చేసుకున్న యువకుడు ప్రియురాలిని రెండో పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. పెళ్లైన తర్వాత ముఖం చాటేయడంతో మోసపోయానన్న బాధతో యువతి ఆత్మహత్య చేసుకుంది. ఆ విషయం తెలిసిన ప్రియుడు తనను ఎక్కడ కొట్టి చంపేస్తారోనన్న భయంతో బలవన్మరణానికి పాల్పడిన ఘటన వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.

 

 

 

వికారాబాద్ జిల్లాలోని యాలాల మండలం ముకుందాపూర్ గ్రామానికి చెందిన ప్రేమ జంట ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామానికి చెందిన అశోక్ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన అలివేలు ప్రేమించుకున్నారు. సడెన్‌గా అశోక్‌కి వివాహం నిశ్చయమవడంతో అలివేలు నిలదీసింది. తల్లిదండ్రుల ఒత్తిడితో పెళ్లి చేసుకుంటున్నానని.. పెళ్లైన తర్వాత రెండో పెళ్లి చేసుకుంటానని అశోక్ చెప్పడంతో అలివేలు నమ్మేసింది.

 

 

 

అతని పెళ్లయిపోయింది. దాంతో అతను పెళ్లి మాట ఎత్తితే మాట మార్చడంతో అతను ఇంకా పెళ్లి చేసుకోదని తానూ మోసపోయానని గ్రహించిన ఆ మహిళ తన ఇంట్లోనే ఉరి వేసుకొని చనిపోయింది. ఆ విషయం తెలుసుకున్న అతను కూడా ఉరివేసుకొని చనిపోయాడు.. ఆమె చనిపోవడంతో ఆ చావు అతని వల్లే అవుతుందని తెలుసుకొని అతను చనిపోవడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: