జనసేన పార్టీ నేత సినీ నటుడు నాగబాబు ఎప్పుడు ఆంధ్ర రాజకీయాల పై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. గతంలో పార్లమెంట్ ఎలక్షన్ లలో  పోటీ చేసి ఓడిపోయిన మెగా బ్రదర్ నాగబాబు... అంతకుముందు నుండే  మై  ఛానల్ నా ఇష్టం అనే యూట్యూబ్ ఛానల్ పెట్టి ఏపీ రాజకీయాల పై సెటైర్లు వేస్తూ హాట్ టాపిక్ గా మారిన విషయం  తెలిసిందే. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ని టార్గెట్ చేస్తూ... నాగబాబు గతంలో ఎన్నో విమర్శలు చేశారు. ఇక ఎన్నికల తర్వాత కూడా అధికార పార్టీ పైనే కాకుండా టిడిపి పార్టీ పైన కూడా తనదైన శైలిలో విమర్శలు చేస్తూ సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్ గా మారి పోతూ ఉంటారు మెగా బ్రదర్ నాగబాబు. 

 


 జనసేన అధినేత, తమ్ముడు పవన్ కళ్యాణ్ పై ఎవరైనా చిన్న విమర్శలు చేసిన వారికి గట్టిగా కౌంటర్ ఇస్తూ ఉంటారు నాగబాబు. అంతేకాకుండా ఆంధ్ర రాజకీయాల్లో ని అందరు నేతల పై సెటైర్లు వేస్తూ ఉంటారు. ఇక మొన్నటికి మొన్న కరోనా వైరస్ పై కూడా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయిన విషయం తెలిసిందే. తనని  తాను నాస్తికుడిగా ప్రకటించుకున్న నాగబాబు దేవుడిని  నమ్మడం కాదు డాక్టర్లకు వెళ్లి మొక్కండి  అంటూ కరోనా వైరస్ ని ఉద్దేశిస్తూ సోషల్ మీడియా వేదికగా ఎన్నో వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా మరోసారి సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

 

 తాజాగా మెగా బ్రదర్ నాగబాబు పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్  గా మారిపోయింది. ఇటీవలే ఓ కార్యక్రమానికి మాస్కు ధరించి వచ్చిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ సభ్యుడు విజయసాయి  రెడ్డి... నోటికి ధరించిన మాస్క్  తొలగించడంపై మెగా బ్రదర్ నాగబాబు తనధైన శైలిలో సెటైర్ వేశారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన మెగా బ్రదర్ నాగబాబు... విజయసాయి రెడ్డి గారు మాస్కు ముక్కుకు నోటికి పెట్టుకోండి గొంతుకు  కాదు... ఒకవేళ మీరు అసిమ్టొమేటిక్  అయిన  ప్రాబ్లం ఉండదు. మీ సెక్యూరిటీ కూడా మాస్కూలు  పెట్టుకున్నారు  మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి ఫ్యూచర్ లో ఫైట్ చేసుకోవాలి కదా మీతో. మీకు మాస్క్  ఉన్న జనం మిమ్మల్ని గుర్తు పడతారు.. దానికి నేను గ్యారెంటీ అంటూ విజయ్ సాయి రెడ్డి పై సెటైరికల్ గా  ట్విట్టర్లో పోస్టు పెట్టారు మెగా బ్రదర్ నాగబాబు.

మరింత సమాచారం తెలుసుకోండి: