ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచాన్ని ఏ విధంగా చుక్కలు చూపిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ దెబ్బతో ప్రపంచంలోని చాలా దేశాలు లాక్ డౌన్ ని పాటిస్తున్నాయి. దీనితో అందరూ ఎవరింటికి వారు పరిమితమయ్యారని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం ఈ కరోనా గురించి ప్రపంచంలో ఎవరికీ తెలియకుండా ఉంటుంది చెప్పండి. కానీ నిజంగా గా ఒక జంట ఉంది అంటే మీరు నమ్ముతారా... ? అవును నిజమే ఆ జంటకి కరోనా వైరస్ విలయ తాండవం చేస్తుందని విషయం నిజంగా తెలియదు.

 


ఇక అసలు విషయానికి వస్తే.... కరోనా వైరస్ ప్రపంచాన్ని విలయతాండవం చేస్తుంది అనే విషయం వారికి నిజంగా తెలియదు. అలా అని వారు చదువుకున్న వారు కాదు అంటే బాగా చదుకొన్నవారు, అలాగే ఉద్యోగాలు చేసిన వారే. విషయం ఏమిటంటే ఈ దంపతులు 2017 సంవత్సరంలో తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి స్వేచ్ఛగా సముద్రంలో రోజుల తరబడి ఎంజాయ్ చేస్తున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారు అని అనుకుంటున్నారా ఎందుకో కాదండి నిజంగా డబ్బులు ఎక్కువ అయ్యే. బ్రిటన్ లోని మాంచెస్టర్ కు చెందిన మణి శెట్టి, ర్యాన్ అనే దంపతులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి ఒక బోట్ కొనుక్కొని 2017 వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు సముద్రంలో షికారు చేస్తూనే ఉన్నారు.

 


నిజానికి వారిద్దరికీ కావలసినంత ఆస్తి ఉంది. ఇంకేముంది దీనితో ప్రపంచంలో ఏం జరుగుతుందన్న విషయం పూర్తిగా మర్చిపోయి ప్రపంచ వ్యాప్తంగా సముద్రం ద్వారా ప్రపంచాన్ని చుట్టాలని అనుకున్నారు. అనుకున్నదే తరువాయి అన్నిటినీ పక్కనబెట్టి వాళ్లు సముద్రంలో విహరించడం మొదలు పెట్టేశారు. అప్పుడప్పుడు వారి ఇంటి వాళ్లతో టచ్లో ఉండాలని భావించి వారికి ఫోన్ చేసే వారు. అయితే వారికి వారు తెలియజేసింది ఏందంటే ఏదైనా నెగిటివ్ విషయం ఉంది అంటే అది తమకు చెప్పవద్దని వారు కోరారు. ఇక అంతే దీనితో వారు కరోనా వైరస్ గురించి వాళ్లకు ఎటువంటి విషయాన్ని తెలపలేదు.

 


అయితే తాజాగా ఆ జంట తమ బోట్ ను కరేబియన్ దీవుల్లో దగ్గరకు వెళ్లగా కరోనా వైరస్ కారణంగా సరిహద్దులను మూసేసారని వారు తెలిపారు. మరి అప్పుడు ఏం చేయాలి అని వెంటనే ఇద్దరూ తమ బోర్డు సహాయంతో ఇటలీ సమీపం వైపుకు బయల్దేరి వెళ్లారు.అక్కడ ఒక ప్రాంతంలో ఇంటర్నెట్ కనెక్షన్ వచ్చి తమ స్నేహితుల ద్వారా ఆశ్రమం పొందాలి అని వారు ప్రయత్నించిన అది సాధ్యపడలేదు. ఇక దీనితో వారు పోలీసులను ఆశ్రయించగా వారిని ఐసోలేషన్ లో ఉండాలని అధికారులు సూచించారు. దీనితో వారు సముద్రంలోనే ఐసోలేషన్ లో ఉండడం మొదలు పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: