మహిళలకు ఎంతో గౌరవం ఇచ్చి రక్షణ కల్పించే సంస్కృతి ఉన్న భారత దేశంలో రోజురోజుకు మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. కామంతో కళ్లు మూసుకుపోయిన రాక్షసులు చిన్న పెద్ద అనే తేడా లేకుండా మీద పడిపోయి పశువాంచ తీర్చుకుంటున్నారు. రోజురోజుకు మహిళలపై జరుగుతున్న అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయి. ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ మహిళలు కామపు కోరల్లో  చిక్కుకోక తప్పడం లేదు . ముఖ్యంగా అభం శుభం తెలియని ఇంకా లోకాన్ని కూడా సరిగ్గా చూడని  చిన్నారులపై కూడా అతి దారుణంగా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. దీంతో రోజురోజుకు సమాజంలో తీరూ  ఎటు పోతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. 

 

 

 తాజాగా జార్ఖండ్ లో జరిగిన దారుణ ఘటన సభ్యసమాజం తలదించుకునేలా చేస్తుంది. కామంతో కళ్లు మూసుకుపోయిన ఇద్దరు వ్యక్తులు బహిర్భూమికి వెళ్లిన బాలికను కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే... జార్ఖండ్లోని గిరిధిహ్  జిల్లాలో ని తిసారి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన బాలిక ఈనెల 19వ తేదీన సమీపంలో ఉన్న నదీ తీరానికి బహిర్భూమికి ఒంటరిగా వెల్లింది.  అయితే ఆ యువతి ఒంటరిగా వెళ్తున్నది గమనించిన ఇద్దరు కామాంధులు ఆ బాలికను బెదిరించి బైకుపై ఎక్కించుకున్నాడు. ఆ తర్వాత ఓ పాడుబడ్డ బంగళా కి తీసుకెళ్లారు.. 

 

 

 అయితే సదరు మైనర్ బాలికను బంధించిన ఇద్దరు కామాంధులు... ఆ బాలికపై అనేక సార్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇక అంతే కాకుండా చిత్రహింసలకు కూడా గుర్తు చేశారు. ఎలాగోలా కామందుల బారి నుంచి తప్పించుకున్న సదరు మైనర్ బాలిక ఇంటికి వెళ్ళి  తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పి బోరున విలపించింది. దీంతో తల్లిదండ్రులు గ్రామ పెద్దలకు సమాచారం అందించగా.. వారు ఈ విషయాన్ని గ్రామపంచాయతీలో పరిష్కరించేందుకు ప్రయత్నించారు. నిందితుల నుంచి ఎంతో కొంత డబ్బు ముట్ట చెప్పేందుకు ప్రయత్నించినా గ్రామ పెద్దలు  పోలీస్ కేసు పెట్టొద్దు అంటూ హెచ్చరించారు. అయితే గ్రామ పెద్దల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బాధితురాలు స్థానిక పోలీసు స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: