కరోనా కారణంగా ప్రజల ఉపాధి అవకాశాలు దారుణంగా దెబ్బ తిన్నాయి. చాలా కుటుంబాల్లో పూటగడవడమే ఇబ్బందిగా ఉంది. లాక్ డౌన్ పుణ్యమా అని జనం ఆదాయాలు దారుణంగా పడిపోయాయి. ఇలాంటి సమయంలో ఇప్పుడు మరికొన్ని రోజుల్లో పాఠశాలలు మొదలవబోతున్నాయి. ఇప్పటికే పలు స్కూళ్లు తల్లిదండ్రులకు స్కూలు ఫీజులు కట్టాలంటూ తల్లిదండ్రులను ఫోన్ మెస్సేజుల ద్వారా అలర్ట్ చేస్తున్నాయి.

 

 

లాక్ డౌన్ కారణంగా ఆదాయం పడిపోయినా ఏదీ ఆగదు. ఇంటి అద్దె ఆగదు.. పిల్లల స్కూళ్ల ఫీజులు ఆగవు.. పాల బిల్లు, కరంటు బిల్లు ఏదీ ఆగదు. అయితే ఇప్పుడు జగన్ సర్కారు మాత్రం పిల్లలు ఉన్న తల్లిదండ్రులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో విద్యా సంస్థల యాజమాన్యాలు ఫీజులు కట్టాలంటూ పిల్లల తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తే చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది. ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కాలేజీ ఫీజులపై పాఠశాల విద్యాశాఖ నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్ కాంతారావు ఈ మేరకు దేశాలు జారీ చేశారు.

 

 

రానున్న విద్యా సంవత్సరంలో ఫీజులు పేరుతో ఎవ్వరికీ అడ్మిషన్లు తిరస్కరించకూడదని పాఠశాల విద్యాశాఖ నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్ కాంతారావు తెలిపారు. అలాగే ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి అధిక ఫీజులు పెంచితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లాక్‌డౌన్‌ సమయంలో ఫీజులు కట్టాలని ఇబ్బందులకు గురిచేయవద్దని పాఠశాల విద్యాశాఖ నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్ కాంతారావు పేర్కొన్నారు. పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో గత ఏడాది నిర్ణయించిన ఫీజులు మాత్రమే వసూలు చేయాలని ఆదేశించారు.

 

 

అది కూడా మొదటి త్రైమాసిక కాలం ఫీజు మాత్రమే వసూలు చేయాలని విద్యా సంస్థల యాజమాన్యాలకు పాఠశాల విద్యాశాఖ నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్ కాంతారావు సూచించారు. మొదటి త్రైమాసిక ఫీజును కూడా రెండు విడతలుగా వసూలు చేయాలని కాంతారావు సూచించారు. మరి ఈ ఆదేశాలను స్కూళ్లు పాటిస్తాయా..?

 

మరింత సమాచారం తెలుసుకోండి: