ఈ మధ్య కాలంలో మనుషుల ప్రాణాలకు విలువ లేకుండా పోతుంది. తాను ఒక  మనిషినే అన్నది  మర్చిపోయి మానవత్వాన్ని మరిచి మనుషుల ప్రాణాలు తీస్తున్నారు . అత్తమామల అంటే తల్లిదండ్రుల తర్వాత తల్లి తండ్రులతో సమానం.కానీ  ఇక్కడో  కోడలు ఏకంగా తల్లిదండ్రులతో సమానమైన అత్తమామలను హతమార్చింది. ఈ ఘటన  స్థానికంగా కలకలం సృష్టించింది. తన అత్తమామలు కూడా వృద్దులు అని దయ చూపకుండా అతి దారుణంగా దాడి చేసి అత్తమామలను హత్య చేసినది  కసాయి కోడలు. ఇక వృద్ధ దంపతులు హత్యకు గురయ్యారని సమాచారం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఘటనాస్థలికి చేరుకొని... పరిశీలించి పలు వివరాలను సేకరించారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

 

 

 పశ్చిమ ఢిల్లీ లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.వృద్ధ దంపతులు అయినా రాజాసింగ్ (61)  ఒవంతి (58) ఢిల్లీలోని దుర్గ విహార్ ప్రాంతంలో నివసిస్తూ ఉంటారు. కాగా నిన్న ఒకే మంచం మీద ఈ వృద్ధ దంపతుల మృతదేహాలు కలకలం రేపాయి. అక్కడి స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడ మృతదేహాల పరిస్థితిని పరిశీలించారు. అయితే ఆ వృద్ధ దంపతుల మృతదేహాల ముఖం  మీద గాయాలు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. దీంతో అనుమానితులగా  కోడలు కొడుకు ని అరెస్ట్ చేశారు పోలీసులు. 

 

 

 అయితే కోడలు కవిత వృద్ధ అత్తమామలను గొంతు పిసికి అనంతరం కత్తితో పొడిచి హత్య చేసిందని విచారణలో నేరం అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. అయితే అత్తమామలను చంపడానికి ఆస్తి వివాదమే కారణమని పోలీసులు గుర్తించారు. అయితే ఏకంగా భర్త ఎదుటే కోడలు అత్తమామలను చంపి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ హత్యలో భర్త  సతీష్ సింగ్ పాత్ర ఏమిటి అన్న దానిపై క్లుప్తంగా దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. ఇప్పటికే వారిద్దరినీ అదుపులోకి పలు కోణాల్లో విచారణ కొనసాగిస్తున్న పోలీసులు... మరిన్ని కీలక వివరాలను సేకరిస్తున్నారు. హత్య జరిగిన సమయంలో కొడుకు కోడలు తో పాటు వారి ఇద్దరు పిల్లలు కూడా గదిలోనే ఉన్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: