ఏబీఎన్ ఆర్కే ఈ వారం తన కొత్త పలుకులో ఎన్నడు లేని విధంగా సలహాలు ఇచ్చే విధంగా వ్యవహరిస్తున్నట్లు వైకాపా అభిమానులు అంటున్నారు. మామూలుగా అయితే ఏబీఎన్ ఆర్కే ఎప్పటికప్పుడు వైయస్ జగన్ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని నెగిటివ్ గా జనాలలో ప్రోజెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఇటీవల కన్నా లక్ష్మీనారాయణ వర్సెస్ విజయసాయి రెడ్డి గొడవ విషయాన్ని తన ఈ వారం కొత్త పలుకులో ప్రస్తావిస్తూ వైయస్ జగన్ ని ముంచడానికి విజయసాయిరెడ్డి స్కెచ్ వేసినట్లు ఆర్టికల్ రాశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కరోనా వైరస్ రాపిడ్ టెస్టింగ్ కిట్స్ విషయం లో ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఏపీ ప్రభుత్వం పై అవినీతి ఆరోపణలు చేసిన విషయం అందరికి తెలిసిందే.

 

ఈ విషయంలో వైసీపీ సీనియర్ నాయకుడు విజయ్ సాయి రెడ్డి మరియు కొంతమంది నాయకులు కూడా అదే స్థాయిలో కన్నా కి గట్టి కౌంటర్లు వేయడం జరిగింది. జాతీయ స్థాయిలో మరియు ఇతర రాష్ట్రాల్లో ఉన్న బిజెపి నాయకులు అంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం చేస్తున్న పని తీరు గురించి మెచ్చుకుంటే కన్నా లక్ష్మీనారాయణ ఒక్కరే ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు కి కన్నా 20 కోట్లకు అమ్ముడు పోయారని, మధ్యలో సుజనా చౌదరి మధ్యవర్తిత్వం వహించాడని అనేక ఆరోపణలు చేయడం జరిగింది. ఇదే సమయం లో విజయసాయి రెడ్డి మాట్లాడుతూ తాను సుజనా చౌదరి దగ్గర ఆడిటర్ గా  పని చేశానని ఆయన సీక్రెట్ లన్ని బయటపెడతానని, అవినీతి బాగోతం అంతా ఇప్పుడు చెబితే వేరేలా ఉంటుందని వ్యాఖ్యానించడం జరిగింది.

 

ఈ విషయాలను తీసుకుని ఏబీఎన్ ఆర్కే తన కొత్త పలుకులో ప్రస్తావిస్తూ సుజనా చౌదరి దగ్గర పనిచేసిన విజయసాయిరెడ్డి మానేశాక అతన్ని బెదిరిస్తున్నాడు, ప్రస్తుతం జగన్ దగ్గర పని చేస్తాడు భవిష్యత్తులో ఏదైనా జరిగి బయటకొచ్చాక జగన్ ని బెదిరించాడు అని గ్యారెంటీ ఏంటి అని తన ఆర్టికల్ లో  పేర్కొన్నాడు. దీంతో ఏబీఎన్ ఆర్కే రాసిన ఆర్టికల్ పై వైసీపీ అభిమానులు సెటైర్ లు వేస్తున్నారు. అంతా కష్టపడి గెలిచిన జగన్ కి ఎవరు ఎలా ప్రవర్తిస్తారో బాగా తెలుసు. గొడవలు పెట్టడానికి కాకపోతే విజయ్ సాయి రెడ్డి కీ జగన్ కీ మధ్య ఆర్‌కే ఏదేదో చెప్తున్నాడు .. పోనీ జగన్ కి రాజకీయ సలహాదారు గా జాయిన్ అవుతావా ఆర్‌కే అని అభిమానులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: