ఈ మధ్యకాలంలో అక్రమ సంబంధాలు బాగా పెరిగిపోతున్న విషయం తెలిసిందే. భార్య వేరొక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోవడం లేదా భర్త ఇంకో మహిళతో రాసలీలలు కొనసాగించడం అలాంటి ఘటనలు చాలానే జరుగుతున్నాయి. అయితే దేశ వ్యాప్తంగా లాక్ డౌన్  కొనసాగుతున్న నేపథ్యంలో ఈ అక్రమ సంబంధాలు  కాస్త తగ్గిందనే చెప్పొచ్చు. అందరూ ఇంటికే పరిమితం కావాలని ప్రభుత్వం సూచనలు సలహాలు ఆదేశాలు చేస్తున్న వేళ ప్రజలు అక్రమ సంబంధాలు దూరంగానే ఉంటున్నారు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం లాక్ డౌన్  సమయంలోనూ ప్రియురాలిని కలుసుకోవడానికి మాస్టర్ ప్లాన్ వేసి చివరికి భార్య కు దొరికిపోయాడు. 

 

 మామూలుగా ప్రభుత్వం అత్యవసర సమయాల్లో ఎవరైనా బయటికి వెళ్ళాలి అనుకునే వారికి పాసులు అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అత్యవసర పనులను నిమిత్తం పాసు తీసుకుని ఓ వ్యక్తి ఆ పాస్ ని  ప్రియురాలితో రాసలీలలు జరిపేందుకు ఉపయోగించాడు. వివరాల్లోకి వెళితే... హైదరాబాద్ కూకట్ పల్లి కి చెందిన ఓ వ్యక్తి ఫార్మాసిటికల్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ఇక లాక్ డౌన్  సమయంలో ఫార్మా సిటీకల్ కంపెనీల ఉద్యోగులకు మినహాయింపు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వెహికిల్ పాస్  తీసుకున్న ఆ వ్యక్తి ప్రతి రోజు ఆఫీస్ కి వెళ్తున్నాడు కానీ సమయంలో మాత్రం తేడా వచ్చేసింది. రోజు ఉదయం వెళ్లి సాయంత్రం కల్లా ఇంటికి వచ్చే సదరు వ్యక్తి  లాక్ డౌన్ లో  ఇంటికి రావడం లేదు దీంతో... అనుమానం వచ్చిన భార్య ప్రశ్నించగా ఆఫీసులో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అని తెలిపాడు.  

 

 అయితే భర్త తీరుపై అనుమానం వచ్చిన భార్య రెండు రోజుల తర్వాత సదరు వ్యక్తి కొలీగ్స్ కి ఫోన్ చేసి ఆరా తీయగా  రోజు సాయంత్రం ఆఫీసు నుంచి వెళ్లిపోతున్నాడని కొలీగ్స్  చెప్పడంతో షాకైన భార్య లోతుగా ఆరా తీయగా భర్త మరో మహిళతో అక్రమ పెట్టుకున్నట్లు వెల్లడైంది. దీంతో షీ టీమ్స్  కి ఫోన్ చేసి తన బాధను చెప్పుకున్నది మహిళ .తన కాపురం  నిలబెట్టాలని వేడుకొంది  దీంతో పోలీసులు సదరు వ్యక్తిని పిలిపించి బుద్దిగా  ఉండాలని కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: