కరోనాతో ప్రపంచం అల్లాడుతుంటే.. కామంతో కొందరు చిత్తకార్తె కుక్కల్లా ప్రవర్తిస్తున్నారు.. మదం మెదడుకెక్కితే మంచిచెడులు మరచి ప్రవర్తిస్తున్నారు.. నిజానికి సమాజంలో చీడపురుగుల్లాంటి వారు చాల వరకు తయారు అయ్యారు అని చెప్పవచ్చు.. ఎందుకంటే ఇప్పటి వరకు ఆడ, మగ, ముసలి, ముతక, పిల్లా జల్లా అని చూడకుండా, చివరికి జంతువులను కూడా వదలకుండా కండకావరంతో, దేహంలోని కోరికలను విచ్చల విడిగా పోషిస్తూ కుక్కలా ఎగబడి కోరికలు తీర్చుకుంటున్నారు..

 

 

ఒకరకంగా మనిషి, మృగానికి మారుతున్నాడని చెప్పడానికి ఇదొక ఉదాహరణ.. అంతే గాక మానవాళికి ఇది ప్రమాదకరమైన విషయం.. ఇక ప్రస్తుత పరిస్దితుల్లో బ్రతకడం అనేది గాల్లో గాలిపటంలా మారిన నేపధ్యంలో కరోనా లక్షణాలతో ఉన్న యువతిని కూడా వదలకుండా అనుభవించారు కొందరు దరిద్రులు అని చెప్పబడే మగవారు.. ఆ వివరాలు చూస్తే.. రాజస్థాన్ రాష్ట్రంలోని, సవాయ్ మాధోపూర్ బటోడా పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతిలో కరోనా లక్షణాలు కనిపించడంతో రక్తనమూనాలు సేకరించి టెస్ట్ కోసం పంపి, ఆ రిపోర్ట్స్ వచ్చే వరకు ఆ యువతిని అదే గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్లో ఉండేలా ఏర్పాట్లు చేశారు..

 

 

అయితే గత వారంలో ఒకరోజు యువతి నిద్రపోతుండగా, ఆమెపై కన్ను వేసిన ముగ్గురు కామాంధులైన యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారు. కాగా లైంగిక దాడి జరిగిన సమయంలో అక్కడ ఎవ్వరూ లేకపోవడం దారుణం... ఇకపోతే లైంగిక దాడి విషయం వైద్య సిబ్బందికి తెలియడంతో హూటాహుటిన వారు అక్కడకు చేరుకునేలోపే నిందితులు అక్కడి నుంచి పరారయ్యారట. ఈ విషయాన్ని పోలీసులకు యువతి తెలుపగా, వెంటనే గాలింపు చర్యలు చేపట్టి నిందితులైన ఆ ముగ్గురు నీచులను అదుపులోకి తీసుకుని అత్తవారింటికి పంపారు..

 

 

ఇక వీరికి కూడా కరోనా టెస్టులు తప్పవు.. చూసారా మనుషులు చివరికి కరోనాను కూడా వదలడం లేదు.. అంతేలే ధర్మం ఒక్క పాదం మీద ఉందంటే ఏంటో అనుకున్నారు.. చివరికి చావు దశలో ఉన్న పరిస్దితుల్లో కూడా కామం ఇలా మనుషులను పీక్కుతింటుంది..  ఇన్ని పాపాలు పెరిగిపోతుంటే, ప్రపంచం నాశనం కాకుండా ఏమవుతుంది.... అందుకే లోకం మీద జాలిపడవలసిన అవసరం లేదు.. ఎందుకంటే నిజాయితీగా ఉన్న వారు ఎప్పుడు ఉన్నతంగానే జీవిస్తారు.. అని అనుకుంటున్నారు ఈ విషయం తెలిసిన వారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: