ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా సోకిన సంగతి తెలిసిందే. అయితే ఈ వైరస్ నుంచి కోలుకుని, పూర్తి ఆరోగ్యంగా జాన్సన్ మారారు. ఈ నేపథ్యంలో సోమవారం (ఏప్రిల్ 27) నుంచి ఆయన తిరిగి ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. కరోనా మహమ్మారి నుంచి బ్రతికి బయట పడ్డా ప్రధాని బోరిస్ జాన్సన్ మరో శుభవార్త అందించారు. కాగా, బోరిస్ గైర్హాజారీలో ఆయన స్థానంలో ప్రధానిగా వ్యవహరించిన విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డొమినిక్ రాబ్ వ్యవహరించారు. బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ దంపతులు పండంటి బిడ్డకు జన్మనిచ్చారు.
లండన్లోని ఓ ఆసుపత్రిలో బుధవారం ఉదయం మగబిడ్డకు జాన్సన్ భార్య క్యారీ సైమండ్స్ జన్మనిచ్చారు. తల్లీ, కుమారుడు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు ప్రధాని కార్యాలయం వెల్లడించింది. లండన్లోని హాస్పిటల్లో పుట్టిన బేబీ ఆరోగ్యంగా ఉన్నట్లు ప్రధాని కార్యాలయం పేర్కొన్నది. ఎన్హెచ్ఎస్ మెటర్నిటీ బృందానికి ప్రధాని, ఆయన ఫియాన్సీ సైమండ్స్ కూడా కృతజ్ఞతలు తెలిపారు. బోరిస్ జాన్సన్ వయసు 55 ఏళ్లు కాగా ఆయన గర్ల్ఫ్రెండ్ సైమండ్స్ వయసు 32 ఏళ్లు.
గత ఏడాది ఈ ఇద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఈ వేసవి కాలంలో బిడ్డకు జన్మనివ్వనున్నట్లు మార్చిలో ప్రకటించారు. ఇదిలా ఉంటే ప్రధాని కార్యాలయం డౌనింగ్ స్ట్రీట్లోకి పెళ్లికాకుండా అడుగుపెట్టిన తొలి జంట వీరిదే కావడం విశేషం. బోరీ జాన్సన్ ప్రధాన మంత్రి అయినప్పటి నుంచి బోరీ, కారీ సైమండ్స్ సహజీవనం చేస్తున్నారు. ప్రస్తుతం వీరికి మొదటి బిడ్డ జన్మించింది. బోరీస్, కారీ దంపతుల ఇంట్లో ఆనందం వెల్లివిరిసిందంటూ ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి మట్ హకాక్ సోషల్ మాద్యంలో అభినందనలు తెలిపారు. జాన్సన్ మొదటి భార్య అయిన మారియా వీలర్ ఈ సంవత్సరంలోనే విడాకులు తీసుకున్నారు.