టీనేజ్ రాగానే అమ్మాయికి అబ్బాయికి మధ్య ఒక బాండింగ్ వస్తుంది..అదే ఆకర్షణ .. అప్పుడు తెలియకుండానే ఎన్నో తప్పులు చేస్తారు.. రాంగ్ రూట్ లో కూడా వెళతారు.. అంతేకాక ఎన్నో అఘాయిత్యాలకు కూడా పాల్పడతారు.. అందుకే హత్యలు , అత్యాచారాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి.. అసలు విషయానికొస్తే ఆలస్యంగా ఓ వార్త వెలుగులోకి వచ్చింది.. అదేంటంటే ప్రియుడితో వెళ్లిందని .. కన్న తల్లీ కూతురిని చంపించింది.. 

 

 

 

 

 

 

 

వివరాల్లోకి వెళితే...ప్రేమించిన కారణానికి ఓ యువతి కన్నతల్లి చేతిలోనే దారుణహత్యకు గురైన ఘటన పంజాబ్‌లో చోటుచేసుకుంది. హోషియాపూర్‌కు చెందిన బల్వీందర్‌ కౌర్‌ కుమార్తె(19).. భల్జాన్‌ గ్రామానికి చెందిన అమన్‌ ప్రీత్‌ సింగ్‌ అనే వ్యక్తిని కొంతకాలంగా ప్రేమిస్తోంది. ఈ విషయం ఆమె తల్లికి తెలియడంతో ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. కొద్దిరోజుల క్రితం ఆ యువతి తల్లికి తెలియకుండా ఇంటి నుంచి పారిపోయి ప్రియుడి దగ్గరకు చేరుకుంది. దీంతో తన కూతురు కనిపించడం లేదని బల్వీందర్ కౌర్ పోలీసులకు పిర్యాదు చేసింది..

 

 

 

 

కూతురు ప్రియుడి వద్దకు వెళ్లిందని తెలుసుకున్న ఆమె తన బంధువు సదేవ్, సీఎంవోలో పనిచేసే పోలీస్ గుర్దీప్ సింగ్ సహా మరో ముగ్గురు వ్యక్తుల సాయంతో పంచాయతీ పెట్టింది. తన కూతురిని అమన్‌కిచ్చి పెళ్లి చేస్తానని, ఇప్పుడు తనతో పంపించాలని ఆమె కోరింది. దీంతో అమన్ తన ప్రియురాలికి నచ్చజెప్పి తల్లితో పంపించాడు. ప్రియుడితో వెళ్లిపోయి కూతురు తన పరువు తీసిందని బల్వీందర్ పగ పెంచుకుంది. ఆ నేపథ్యంలో కూతురు తినే అన్నంలో నిద్రమాత్రలు కలిపింది..

 

 

 

 

 

 

 

అలా ఆమె మెల్లగా నిద్రలోకి జారుకోగానే.. వారిద్దరు నిద్రలో ఉన్న యువతిని గొంతు నులిమి చంపేశారు. అనంతరం శవాన్ని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి దహనం చేసింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు బల్వీందర్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించింది.అంతేకాక ఈ హత్యకు సహకరించిన బంధువులకు కూడా కటకటాల శిక్ష అనుభవిస్తున్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: