కన్నకొడుకే తండ్రి పాలిట శాపంగా మారాడు. తండ్రి ఒంటరిగా ఉన్నప్పుడు భక్తితో నరికి చంపేశాడు. ఆ తర్వాత ఏమి ఎరగనట్లు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. కానీ పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు తెలిసాయి. పోలీసులు కొడుకు పై అనుమానంతో విచారణ చేపడితే అసలు నిజాలు బయటపెట్టాడు. ఈ విషాద ఘటన నారాయణపేట జిల్లాలో లక్ష్మీపూర్ కి చెందినవి గోపాల్ దారుణంగా హత్య కు గురి అవ్వడం జరిగింది. ఇక పాత కక్షలు కారణంతోనే ఇలా చేశాడు అంటూ అందరూ అనుకున్నారు.

 


ఇక తరుచుగా తాను సంపాదించుకున్న డబ్బులను కొడుకు జల్సాలతో  ఖర్చు చేస్తున్నావు అంటూ తండ్రి, కొడుకులు గొడవ పడుతూ ఉండేవాడు. ఇక చాలాసార్లు ఈ విషయంపై వీరు ఇద్దరూ గొడవ పడేవారు. ఎన్నిసార్లు చెప్పినా తండ్రి ప్రవర్తనలో ఎటువంటి మార్పు లేకపోవడంతో.. కొడుకు తండ్రిని చంపేయాలి అని నిర్ణయం తీసుకున్నాడు. ఇక రాత్రి సమయంలో తండ్రి పొలం దగ్గర ఉన్నాడని సమాచారంతో కత్తితో దాడి చేశాడు. తండ్రి తల, మొండెం వేరు చేశాడు ఆ కిరాతకుడు. ఆ తర్వాత తనకు ఏమీ తెలియనట్లు తండ్రిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు అంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది.

 


దీనితో ఆ ఘటనా స్థలానికి పోలీస్ అధికారులు వెళ్లి మృతదేహాన్ని పరిశీలన చేశారు. నిజానికి కొడుకు చిరంజీవికి తలకు గాయం ఉండడం గమనించి పోలీసులు అతనిని అనుమానించారు. కన్న కొడుకే తండ్రిని చంపి ఈ డ్రామా చేస్తున్నాడు అనే అనుమానంతో పోలీస్ అధికారులు దర్యాప్తు చేసారు. ఇక ఈ దర్యాప్తులో సంపాదించుకున్న డబ్బులు ఖర్చు చేస్తున్న అన్న కోపంతోనే హత్య చేసినట్లు కొడుకు ఒప్పుకోవడం జరిగింది అని పోలీసు అధికారులు వెల్లడించారు. దీనితో అతనిని కస్టడీకి పామోయడం జరిగింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: