ప్రపంచ దేశాలను కుదిపేస్తున్న కరోనా వైరస్ తో పోరాడటానికి ప్రతిపక్షం అధికారపక్షం అనే తేడా లేకుండా పోరాడుతున్నాయి. శత్రు దేశాలు అని భావించేవి కూడా ఇప్పుడు ఈ కరోనా వైరస్ తో పోరాడటానికి చేతుల కలుపుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి ఇలా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం పూర్తి భిన్నంగా ఉంది. కరోనా వైరస్ వల్ల మనుషులు రోజు రోజుకి చనిపోవటంతో పాటు పాజిటివ్ కేసులు కూడా బయట పడుతున్న గాని అధికార, ప్రతిపక్ష పార్టీలు కలిసి పని చేయకుండా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఇలాంటి విపత్కర సమయాల్లో కూడా రాజకీయాలకు ప్రాధాన్యతనిస్తూ బండ బూతులు తిట్టుకుంటున్నారు.

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ మహిళ నేత ప్రముఖ స్థానంలో ఉన్న నాయకులు మీడియా ముందే గత ప్రభుత్వానికి చెందిన మాజీ మంత్రి ని బండ బూతులు తిట్టడం విని ఏపీ ప్రజలు ఒక్కసారిగా షాక్ అయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న కరోనా వైరస్ పరీక్షల విషయంలో సదరు టిడిపి మంత్రి చేసిన వ్యాఖ్యలకు ఈమె మాట్లాడుతూ… అసలు ఆ మంత్రి మగవాడో లేకపోతే ఆడవాడో ముందు టెస్ట్ లు చేయించుకోవాలి అని ఈమె చేసిన వ్యాఖ్యలకు అందరూ నోరెళ్ళబెట్టారు.

 

ఇదే సమయంలో సదరు టిడిపి నాయకుడు అనుచరులు ఒకరోజు నైట్ అతనితో గడిపితే తెలుస్తుంది అతడు ఆడో, మాగో అని అంటున్నారు. ఈ వ్యాఖ్యలు విని ఏపీ ప్రజలు సిగ్గూఎగ్గూ వ్యక్తిత్వం లేని వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే ఇలానే ఉంటుందని ఇదంతా మా ఖర్మ అని ప్రజలు అనుకుంటున్నారు. రాజకీయాలు ఒకరిపై ఒకరు చేసుకునే బదులు కరోనా వైరస్ గురుంచి అందరిలాగా కలసి పోరాడితే బాగుంటుంది కదా అని అంటున్నారు. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple.

మరింత సమాచారం తెలుసుకోండి: