వైరస్ కష్టాలు ప్రతి ఒక్కరికి తలనొప్పిగా మారుతోంది. తినడానికి తిండి లేక బయట అడుగు పెట్ట లేక అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోపక్క ప్రభుత్వాలు లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తున్న తరుణంలో ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది. అయినా కానీ కరోనా వైరస్ కంట్రోల్ కావటం లేదు. ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఉన్న కొద్దీ పెరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశాలు చేస్తున్న సరైన రిజల్ట్ కనిపించడం లేదు.
రాష్ట్రంలో కొన్ని చోట్ల లాక్ డౌన్ నిబంధనలను ప్రజలు ఉల్లంఘిస్తున్నట్లు యోగి ఆదిత్యానాధ్ గుర్తించారు. దీంతో మరింత కఠినంగా నిబంధనలను అమలు చేయాలని నిర్ణయించారు. జూన్ 30వ తేదీ వరకూ ఉత్తర్ ప్రదేశ్ లో ఆంక్షలను విధించాలని నిర్ణయించారు. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం.
ఇలాంటి ఈ రాష్ట్రంలో ముందునుండి కరోనా వైరస్ కట్టడి చేయడం కోసం సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్ని జాగ్రత్తలు చేపట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 75 జిల్లాల్లో దాదాపు 56 జిల్లాల్లో కరోనా వైరస్ భయంకరంగా వ్యాపించి ఉంది. ప్రస్తుతం వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో పాటు చాలాచోట్ల నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రజలు వ్యవహరిస్తున్న తరుణంలో జూన్ 3 వరకు లాక్ డౌన్ తలనొప్పులు యోగి ఆదిత్యనాథ్ కి తప్పేలా లేదు.
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
Apple : https://tinyurl.com/NIHWNapple.