మన సంస్కృతి గురించి గొప్పగా మాట్లాడే వారి కంటే కించపరిచే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ముఖ్యంగా రోజురోజుకు పాశ్చాత్య పోకడలకు అలవాటు పడుతున్న చాలా మంది విదేశీ సంస్కృతి గురించి గొప్పలు చెబుతూ ఉంటారు
 ఇక్కడ జీవితం కంటే విదేశాలలో జీవితం ఎంతో స్వేచ్ఛతో ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంతో కూడుకున్నది అని తెగ పొగిడేస్తున్నారు. విదేశాల ప్రజలు సైతం భారత సంస్కృతి ఎంతో గొప్పది అంటూ ప్రశంసలు కురిపిస్తుంటే భారతదేశంలో ఉన్న వాళ్ళు మాత్రం విదేశీ సంస్కృతి వైపు మొగ్గు చూపుతున్నారు. 

 


 ఇలాంటి వారందరికీ ప్రస్తుతం ఆశ్చర్యానికి గురి చేసే వార్త  ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. విదేశీ సంస్కృతి భారతీయ సంస్కృతి తో పోలిస్తే ఎంత నీచంగా ఉంది అనే దానిని ప్రస్తుతం ఈ వార్త స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ వార్త ఎంతోమంది నోళ్లు మూయిస్తుంది. ఇంతకీ ఈ వార్తలు ఏమిటి అంటారా... బ్రిటన్ ప్రధానమంత్రి కాబోయే భార్య పండంటి  మగబిడ్డకు జన్మనిచ్చింది. ఏంటి  ఆశ్చర్యపోయారా  మీరు విన్నది నిజమే బ్రిటన్  ప్రధానికి కాబోయే భార్య పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది ప్రస్తుతం తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. 

 

 ఈ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ కాబోయే భార్య క్యారీ సిమన్స్  పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అంటే కాబోయే భార్య కి ఇప్పుడు పండంటి బిడ్డ అన్నమాట. ఇక కరోనా  వైరస్ బారిన పడ్డ ప్రధాని త్వరలో కోలుకొని విధుల్లో పాల్గొననున్నట్లు వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. గతేడాది బోరిస్ జాన్సన్ ప్రధాని అయినప్పటి నుంచి సిమన్స్  బోరిస్ జాన్సన్ తోనే సహజీవనం చేస్తూ కలిసి ఉంటుంది. అయితే ఈయన గతంలో మరినా  వీలర్ అనే మహిళను వివాహం చేసుకోగ.. వీరికి  నలుగురు సంతానం కలిగారు. ఇక వారిద్దరూ 2018 సెప్టెంబర్ లో విడిపోయారు. ఈ ఏడాది మొదట్లోనే విడాకులు కూడా జరిగాయి. అయితే అంతలోనే కాబోయే భార్య కి పండంటి బిడ్డ అంటే ఆశ్చర్యం కలగక మానదు. ఇలాంటి సంస్కృతినే  ఎంతో మంది భారతీయులు గొప్ప సంస్కృతి గా అభివర్ణిస్తూ ఉంటారు. ఇప్పటికైనా తమ అభిప్రాయాన్ని మార్చుకుంటే మంచిది అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: