ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కోసం అందరూ కలిసి పోరాడుతున్నారు. ఒకప్పటి శత్రుదేశం అని భావించే సందర్భాలు కలిగిన దేశాలు కూడా కరోనా వైరస్ తో పోరాడటానికి చేతులు కలుపుతున్నారు. ఇండియాలో కూడా నాకు అన్ని రాష్ట్రాలలో అధికార మరియు ప్రతిపక్ష పార్టీలు కలిసి పోరాడుతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీకి ఇలాంటి విపత్కర సమయంలో కూడా తాము అండగా ఉంటామని వైరస్ విషయంలో కలిసి పోరాడటానికి సోనియా గాంధీ పిలుపు ఇవ్వడం జరిగింది. దేశంలో అన్ని రాష్ట్రాల పరిస్థితి ఒకలా ఉంటే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోలా ఉంది.

 

రాష్ట్రంలో కరోనా వైరస్ రోజురోజుకీ ఉధృతంగా మారుతోంది. కరోనా వైరస్ వల్ల అనేకమంది బలివుతున్నారు. దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ పరీక్షలు ఎక్కువ చేస్తున్న తరుణంలో, పాజిటివ్ కేసులు భయంకరంగా బయటపడుతున్నాయి. ఇలాంటి సందర్భంలో అధికారంలో ఉన్న వైసిపి నాయకులు మరియు ప్రతిపక్షంలో ఉన్న టిడిపి నాయకులు ఒకరిపై ఒకరు రాజకీయమైన విమర్శలు చేసుకుంటున్నారు.

 

ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని సహకరించకుండా…. ప్రజలను భయపెట్టే విధంగా ప్రకటనలు చేస్తున్నారు. దీంతో ఇళ్లలో ఉన్న ప్రజలు వీళ్లు చేస్తున్న ప్రకటనలకు భయపడుతూనే, మరోపక్క ఇలాంటివారిని…. రాజకీయ నాయకులుగా గుర్తించడం మేం చేసుకున్న దౌర్భాగ్యం అని అంటున్నారు. కరోనా వైరస్ వల్ల మనుషులు చనిపోతుంటే  మరోపక్క రాజకీయాలు చేయడం.. ప్రపంచంలో ఎక్కడా లేదని ఏపీ లోనే కనబడుతుందని ఏపీ రాజకీయ నాయకుల పై జనాలు మండిపడుతున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple. 

మరింత సమాచారం తెలుసుకోండి: