కరోనా నివారణ చర్యలపై ఏపీ సీఎం  వైయస్‌.జగన్‌ సమీక్ష నిర్వహించారు. క్వారంటైన్‌ కేంద్రాల్లో సదుపాయాలు, పారిశుద్ధ్యం, భోజనం సహా పలు అంశాలపై క్రమం తప్పకుండా సమీక్ష చేయాలని సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి కృష్ణబాబుకు సూచించారు. లాక్ డౌన్ సడలింపుతో విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి భారీగా జనాలు భారీగా వచ్చే అవకాశం ఉందని ఏపీ ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. ఈ నేపథ్యంలో క్వారంటైన్ సెంటర్లను పెంచాలని అధికారులను ఆదేశించారు. లాక్‌డౌన్‌ సడలింపులతో విదేశాలనుంచి, ఇతరరాష్ట్రాల నుంచి భారీసంఖ్యలో జనం తరలివచ్చే అవకాశం ఉండటంతో స్క్రీనింగ్‌ చేయడం, అవసరమైన వారిని క్వారంటైన్‌కు తరలించడం తదితర అంశాలపై సీఎం విస్తృతంగా చర్చించారు.

 

విదేశాల నుంచి వచ్చే వారికి  నాన్ కోవిడ్ సర్టిఫికెట్ ఉంటుందని, వారందరినీ హోం క్వారంటైన్ కు తరలించాలని జగన్ సూచించారు. గుజరాత్ నుంచి వచ్చిన మత్స్యకారులకు పూల్ శాంపిల్స్ చెక్ చేసిన ఫలితాల ఆధారంగా ఇళ్లకు పంపించాలని ఆదేశించారు. ఇదిలా ఉంటే.. కాగా, రాష్ట్రంలో ఇప్పటివరకూ 1,00,997 కోవిడ్‌ 19 పరీక్షలు జరగగా నిన్న ఒక్కరోజే 7902 మందికి పరీక్షలు చేశారు.  ప్రతి మిలియన్‌కు 1919 చొప్పున పరీక్షలతో దేశంలోనే రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 235 క్లస్టర్లు, 79 వెరీ యాక్టివ్‌ క్లస్టర్లు,  68 యాక్టివ్‌  క్లస్టర్లు, 53 డార్మంట్‌ క్లస్టర్లు ఉన్నాయి.

 

టెలి మెడిసిన్, విలేజ్ క్లినిక్, పీహెచ్సీల మధ్య సరైన సమన్వయం ఉండాలని చెప్పారు. టెలి మెడిసిన్ కు ఫోన్ చేస్తే ప్రిస్క్రిప్షన్ తో పాటు విలేజ్ క్లినిక్ ద్వారా మందులు బాధితుల ఇళ్లకు చేరాలని అన్నారు.కోవిడ్‌ కారణంగా మరణాలు సంభవించకుండా చూడటమే లక్ష్యంగా పెట్టుకున్నామన్న అధికారులు.. జిల్లాల వారీగా ప్రత్యేక నంబర్లు కేటాయిస్తున్నామని చెప్పారు. ఇక, టెలిమెడిసన్, విలేజ్‌ క్లినిక్, పీహెచ్‌సీల మధ్య సరైన సమన్వయం ఉండాలన్న సీఎం... భవిష్యత్తులో ప్రజలకు మరింత చేరువగా ఉండేలా వైద్య వ్యవస్థను తీర్చిదిద్దుకోవాలని సూచించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: