టీడీపీ నేతలు రాజకీయం చేయడంలో బాగా ఆరితేరిపోయారు. అధికారం కోల్పోయిన దగ్గర నుంచి, ఖాళీగా ఉండలేక జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ రాజకీయం చేస్తున్నారు. అలాగే వైసీపీ నుంచి ఎవరైనా కౌంటర్లు ఇస్తే, వారిని కూడా టార్గెట్ చేసుకుని టీడీపీ నేతలు నీచరాజకీయం చేస్తున్నారు. ప్రతిరోజూ వాళ్ళు విజయసాయిరెడ్డిని టార్గెట్ చేస్తూ, విమర్శలు చేస్తున్నారు.

 

అలాగే వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు టీడీపీని ఇరుకున పెట్టేలా మాట్లాడుతుండటంతో, టీడీపీ నేతలు ఆయన్ని కూడా టార్గెట్ చేసేసారు. తాజాగా అంబటి, చంద్రబాబు కరోనాకు భయపడి హైదరాబాద్ లో ఉన్నారని మాట్లాడారు. ఇక ఆ విమర్శకు కౌంటర్ ఇచ్చే క్రమంలో టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కాస్త హద్దు దాటి విమర్శ చేసారు.

 

అంబటిని కాంబాబు అంటూ వ్యక్తిగత విమర్శలు చేసారు. అంబటి హైదరాబాద్‌లో అలవాటైన గెస్ట్ హౌస్ క్వారంటైన్‌లోకి వెళ్లలేక హస్కీ వాయిస్ మిస్ అవుతున్నట్టున్నారని మాట్లాడారు. గతంలో ఇలానే హస్కీ వాయిస్‌తో పట్టుబడ్డారని, ఇప్పుడు అసలే పదవి తొడయ్యిందని, ఇక ఎంత మందిని వేధిస్తాడో అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసారు. ప్రత్యేక అనుమతులు ఇచ్చి హైదరాబాద్ గెస్ట్ హౌస్ క్వారంటైన్‌లోకి పంపకపోతే కాంబాబు ఏపిలోనే హస్కీ వాయిస్ ప్రయోగిస్తారని దారుణంగా విమర్శలు చేసారు.

 

అయితే గతంలో ఓ టీడీపీ అనుకూల మీడియా రాంబాబు పేరిట ఓ ఆడియో క్లిప్ విడుదల చేసి నానా రచ్చ చేసిన విషయం తెలిసిందే. ఇక దాన్ని దృష్టిలో పెట్టుకునే బుద్దా, పరోక్షంగా అంబటిపై ఇలా దిగజారుడు వ్యాఖ్యలు చేసారు. కాకపోతే ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోవాలి. అంబటి, చంద్రబాబుపై ఎలాంటి విమర్శలు చేసిన అర్ధవంతంగానే ఉంటాయి. చంద్రబాబు గారు అంటూ ఎప్పుడు గౌరవంగానే మాట్లాడతారు. నిర్మాణాత్మకమైన విమర్శలు చేస్తారు. కానీ టీడీపీ నేత చేసిన విమర్శలు చాలా ఘోరం. అలా ఒక వ్యక్తిని పర్సనల్ గా టార్గెట్ గా పెట్టుకుని విమర్శలు చేయడం వారి దిగజారుడు తనానికి నిదర్శనం.

మరింత సమాచారం తెలుసుకోండి: