ఏపీ సీఎం వ్యవసాయ శాఖ అధికారులపై మండిపడ్డారు. కృష్ణా జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు జరుగుతున్నాయంటూ కొన్ని ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఫిర్యాదులపై వ్యవసాయంపై నిర్వహించిన సమీక్షలో జగన్ అధికారులతో చర్చించారు. కృష్ణాజిల్లాలో రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై సమావేశంలో చర్చించారు. ధాన్యం సేకరణ సమయంలో బస్తాకు కొంత ధాన్యాన్ని మినహాయిస్తున్నారన్నది ఆ ఫిర్యాదుల సారాంశం.

 

 

దీనిపై సీఎం జగన్ బాగా సీరియస్ అయ్యారట. జగన్‌ తీవ్రంగా స్పందించారట. ముఖ్యమంత్రి, చీఫ్‌ సెక్రటరీ, సెక్రటరీ, డీజీపీ లాంటి వ్యక్తులంతా కృష్ణా జిల్లాలో ఉన్నా ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఏంటని అధికారులను నిలదీశారట. ఇలాంటి మోసాలపై చూస్తూ ఊరుకోకుండా వెంటనే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. రైతులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోవద్దని స్పష్టం చేశారు.

 

 

ప్రస్తుతం రాష్ట్రంలో ధాన్యం సేకరణ పెంచాలని.. రైతులు ధాన్యం కొనుగోలు లో మోసాలు జరగ కుండా ఉండేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని..... రైతులను మోసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చీనీ, అరటి, టమోటో, మామిడి తదితర ప్రాసెసింగ్ ప్లాంట్లపై దృష్టి పెట్టాలని కూడా సీఎం ఆదేశించారు. ఇకపై రాష్ట్రంలో పంటలను రోడ్డపై పారబోసే ఘటనలు కనిపించడానికి వీల్లేదని అధికారులకు స్పష్టం చేశారు సీఎం.

 

 

వచ్చే ఏడాది మళ్లీ ఈ పంటల విషయంలో మార్కెటింగ్‌ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ రాకూడదని సీఎం జగన్ ఆదేశించారు. అంతే కాదు.. రాష్ట్ర స్థాయి, జిల్లాస్థాయి, మండల స్థాయిలో వ్యవసాయ సలహామండళ్లు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఏయే పంటలు, ఎక్కడ ఎంతమేర సాగుచేయాలన్నదానిపై ఈ బోర్డులు సలహాలు ఇవ్వాలని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: