ప్రస్తుతం దేశం మొత్తం కరోనా  వైరస్ భయంతో గజగజ వణికి పోతున్న విషయం తెలిసిందే. రోజురోజుకు పెరిగిపోతున్న కరోనా వైరస్ కేసులతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇక ఈ మహమ్మారి వెలుగులోకి వచ్చి  నెలలు గడుస్తున్నప్పటికీ ఇంకా ఈ ప్రాణాంతకమైన మహమ్మారికి  విరుగుడు రాకపోవడం ప్రజలను మరింత భయాందోళనకు గురిచేస్తుంది. దీంతో ప్రాణాలను దక్కించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలను సైతం చేస్తున్నారు. ఎన్నో ముందస్తు జాగ్రత్తలను కూడా తీసుకుంటున్నారు ప్రజానీకం. అయితే కొంతమంది కరోనా వైరస్ పై అవగాహన లేమితో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. 

 

 

 కరోనా వైరస్ కు మందు లేదని తెలిసి నివారణ చర్యల గురించి తెలియక పోవడంతో ఏం చేయాలో పాలుపోక కొంతమంది కరోనా  భయంతో ఆత్మహత్యలు చేసుకున్నవారు కూడా ఉన్నారు అనే విషయం తెలిసిందే. దగ్గు జలుబు లాంటి లక్షణాలు ఉండడంతో అది సాధారణ జ్వరమే అయినప్పటికీ కరోనా ఏమో అని భావించి భయంతో ఆత్మహత్య చేసుకున్న వారు కూడా చాలామంది ఉన్నారు. ఇక్కడ ఇలాంటి ఘటన జరిగింది... ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా పట్ల కొంత మందికి సరైన అవగాహన లేక మానసిక ఆందోళనతో వింతగా విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. మరికొంత మంది ఆత్మహత్యలకు కూడా పాల్పడుతుంటారు. 

 

 

 తాజాగా హర్యానాలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.. ఓ వ్యక్తి తన భార్యకు కరోనా వైరస్ సోకింది  అని తెలిసి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. హర్యానాలోని గురుగ్రామ్ కు చెందిన ఓ వ్యక్తి తన భార్యతో కలిసి నివసిస్తున్నాడు. తాజాగా తన భార్యకు కరోనా  పాజిటివ్ అని తేలింది. దీంతో ఉన్నట్టుండి ఆ వ్యక్తి నిన్న రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇక ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇద్దరూ ఒకే ఇంట్లో ఉండటం కారణంగా కేవలం భార్యకు మాత్రమే పాజిటివ్ వచ్చిందా  లేదా భార్య ద్వారా భర్తకు కూడా వచ్చి ఉంటుందా  అన్నది మాత్రం తెలియాల్సి ఉంది. పోస్టుమార్టం తర్వాత  ఈ విషయం తేలుతుందని పోలీసులు వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: