గత కొన్నిరోజులుగా ప్రతిపక్షాలు చేసే ఆరోపణలని తిప్పికొట్టడానికి అధికార వైసీపీ నేతలు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా వైసీపీలో అంబటి రాంబాబు తనదైన శైలిలో ప్రతిపక్షాల కౌంటర్లుకు చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా చంద్రబాబు, కన్నా లక్ష్మీనారాయణలపై విరుచుకుపడుతున్నారు. దీంతో అంబటిని టీడీపీ, బీజేపీ నేతలు గట్టిగా టార్గెట్ చేసి, వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు.

 

టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అయితే కాస్త ఓవర్ గానే రియాక్ట్ అవుతూ, అంబటిపై విమర్శలు చేసారు. అంబటిని కాంబాబు అంటూ మాట్లాడారు. అయితే టీడీపీ నేతలు ఇలాంటి విమర్శలు చేయడం కామనే. అయితే పెద్దగా వ్యక్తిగత దూషణలు చేయకుండా, రాజకీయ పరంగా విమర్శలు చేసే బీజేపీ నేతలు కూడా అంబటిని టార్గెట్ చేసి, తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవల కన్నా లక్ష్మీనారాయణపై అంబటి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ, అంబటి వేస్ట్ కార్డుకి ఎక్కువ - జోకర్ కు తక్కువ అని, అంబటి తన స్థాయి మరిచి మాట్లాడుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేసారు.

 

ఇంకా అంబటి రాజకీయ జీవితం ఒక పెంపుడు కుక్క తరహాలో సాగిందని, అంబటి బ్రోకర్ రాజకీయాలకు తప్ప సిసలైన రాజకీయానికి పనికి రారని దారుణంగా విమర్శించారు. ఈ క్రమంలోనే బీజేపీ నేతలు ఓ ఆసక్తికర విషయం చెప్పారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో రాంబాబుకు అనుభవలేమి కారణంగా ఎమ్మెల్యే టికెట్ తిరస్కరించారని అంటున్నారు. అయితే వైఎస్సార్ హయాంలో అంబటి టికెట్ దక్కలేదు. ఇక అదే విషయాన్ని వారు ఇలా ఎత్తి చూపిస్తున్నారు.

 

అయితే బీజేపీ నేతలు కూడా మాట్లాడటం చాలా వింతగా ఉందని వైసీపీ కార్యకర్తలు అంటున్నారు. టీడీపీతో రహస్య పొత్తు ఉండటం వల్లే, బీజేపీ వాళ్ళు కూడా ఇలాంటి చెత్త విమర్శలు చేస్తున్నారని, ఒక శాతం ఓట్లు కూడా రానివారి మాటలని తాము పట్టించుకోమని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: