మహిళలను కాపాడటాని కి దేశం లో ఎన్నో రకాల చట్టాల ను ప్రభుత్వం అమలులో కి తీసుకొస్తుంది. అయినా కూడా కామాంధులు కామ దాహం మాత్రం తీర లేదు.. రోజు కొకరు కామాంధు ల రాక్షసత్వాన్ని కి బలవుతున్నారు.. దిశ లాంటి ఎందరో మహిళలు ప్రాణాలను అర్పిస్తున్న కూడా సమాజంలో మార్పు అనేది రాకపోవడంతో పాటుగా ఇంకా రెచ్చిపోతున్నారు..ఇక పోతే కరోనా పేషెంట్ల కు ఆదుకోవడాని కి ముందుకొస్తున్నారు..


 

 

 

వివరాల్లోకి వెళితే.. కరోనా కష్టకాలంలోనూ ప్రజల ప్రాణాలు కాపాడేందుకు విధులు నిర్వర్తిస్తున్న నర్సులపై అత్యాచార యత్నం చేశారు. తమ సహోద్యోగిని కోసం ఆస్పత్రికి వెళ్తున్న నర్సులను నడిరోడ్డుపై అడ్డగించి రేప్ చేసేందుకు ప్రయత్నించారు. ఈ దారుణ ఘటన అస్సాంలోని బిశ్వనాధ్ జిల్లాలో చోటుచేసుకుంది.జిల్లాలోని బిశ్వనాధ్ చారియాలి పట్టణంలోని ఓ ఆస్పత్రిలో పని చేస్తున్న ఇద్దరు నర్సులు తమ సహోద్యోగిని కోసం ఆస్పత్రికి బయల్దేరారు.



 

 

 

తమ కోసం ఎదురుచూస్తున్న స్నేహితురాలిని తీసుకొచ్చేందుకు ఆస్పత్రికి వెళ్తుండగా గుర్తు తెలియని దుండగులు వారిని అడ్డగించారు. పెట్రోల్ బంకు సమీపంలో వారిని అటకాయించి అసభ్యంగా ప్రవర్తించారు.అంతేకాకుండా ఎక్కడం టంటే అక్కడ చేతులతో తాకుతూ చేశారు.. రోడ్డు పక్కకు తీసుకెళ్లి ఇద్దరు నర్సులపై అత్యాచార యత్నం చేశారు. ఊహించని ఘటనతో భయపడిపోయిన నర్సులు ఎలాగో వారి బారి నుంచి తప్పించుకుని ఆస్పత్రికి చేరుకున్నారు. ఆస్పత్రి సిబ్బందికి విషయం తెలియజేయడంతో వారు దుండగులను వెంబడించారు. ఒక నిందితుడిని పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు లైంగిక వేధింపుల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు... వారి మీద పొక్స్ కేసులు నమోదు చేశారు..

మరింత సమాచారం తెలుసుకోండి: