దేశంలో మళ్లీ బ్రాందీ షాపులు తెరచుకున్నాయి. దీనితో మందు బాబులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. దీనికోసం నేటి ఉదయం నుంచి బారులు తీరుతూ క్యూలైన్ లలో తమ వంతు కోసం వేచి చూస్తూ మందు కొనడానికి సిద్ధమయ్యారు మందు బాబులు. అయితే ఇక్కడ కేవలం మగవారి అనుకున్నారు కదా..  ఒకవేళ మీరు ఇలా అనుకుంటే వేడి వేడి సాంబార్ లో కాలు వేసినట్టే. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో మగ వారికి దీటుగా ఆడవారు కూడా క్యూ లైన్స్ లో నిలబడి మందు కొనడానికి ఎగబడ్డారు.


అయితే ఇక అసలు విషయానికి వస్తే బెంగళూరు సిటీలోని ఎంజీ రోడ్డులో ఒక విచిత్ర సంఘటన ఎదురైంది. మామూలుగా ఎంజీ రోడ్డు విలాసమైన పబ్ లు, బార్ అండ్ రెస్టారెంట్ బ్రాందీ షాపులు మాల్స్ ఇలా బాగా కాస్ట్లీ ఏరియా అని చెప్పవచ్చు. అయితే అదే ప్రాంతంలో స్థానిక టానిక్ వైన్ షాప్ కూడా ఉంది. సోమవారం ఉదయం నుంచి అక్కడ మద్యం కొనుగోలు చేయడానికి వందలాది మంది క్యూలో నిలబడి ఉన్నారు. అయితే ఈ వరుసలో మందుబాబులతో పాటు కొందరు యువతులు కూడా నిలబడి ఉన్నారు. ఇదిలా ఉండగా క్యూలైన్ ముందుకు సాగుతున్న సమయంలో యువతి హఠాత్తుగా కుప్పకూలిపోయింది.


దీంతో అక్కడున్న కొందరు మందుబాబులు, పోలీసులు వచ్చి సదరు అమ్మాయిని లేపి ఒక కుర్చీలో కూర్చోబెట్టి అక్కడ ఓ షాప్ లో మంచినీళ్ళ బాటిల్ తీసుకువచ్చి ఆ యువతితో తాగించారు. అయితే కొద్ది సేపటికి తేరుకున్న తర్వాత ఆ యువతిని ఎందుకిలా పడిపోయావ్..? అని పోలీసులు అడగగా వారికి షాకింగ్ విషయం చెప్పింది. గత 45 రోజులుగా లాక్ డౌన్ కారణంగా బార్లు మూతపడడంతో మందు దొరక్క ఇబ్బంది పడుతున్నామని కాబట్టి ఉదయం టిఫిన్ చేయకుండా క్యూలో నేను, నాతోటి నా స్నేహితులు కూడా టిఫిన్ చేయకుండా నిలబడ్డామాని చెప్పింది. దీంతో పోలీసులకు అక్కడ ఉన్న ప్రజలకు దిమ్మతిరిగే షాక్ తగిలింది. ఇంత జరిగినా ఆ అమ్మాయి వెళ్లిపోయిందా అంటే తిరిగి మళ్ళీ క్యూలైన్లో నిలబడి ఉంది. దీనితో మళ్లీ పోలీసులకు, అక్కడ ఉన్న మందుబాబులకు మరోసారి కళ్ళు తిరిగాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: