భారత దేశంలో కరోనా ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ ను మే 17 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే..ఈ మేరకు ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు..దానితో ఆన్నీ రకాల సంస్థలు మూతపడ్డాయి..ప్రస్తుతం కరోనా కేసులు కొన్నీ ప్రాంతాలు కరోనా ఏరియాల్లో లేకపోవడంతో గ్రీన్ జోన్ ను ప్రకటించారు.. ఇకపోతే తెలుగు రాష్ట్రాల లోని మద్యం దుకాణాలను తెరవాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది.. 

 

 

 

దేశంలోని మందు బాబులకు ఈ రోజు శుభదినం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు 40 రోజులుగా తెరుచుకోని మందు దుకాణాలు ఇవ్వాళ ఓపెన్ అయ్యాయి. లాక్ డౌన్ కారణంగా ఇన్ని రోజులు క్లోజ్ అయిన వైన్ షాపులు ప్రధాని మోడీ షరతులతో కూడిన పర్మిషన్ ఇవ్వడంతో ఈ రోజు నుంచి అందుబాటులోకి వచ్చాయి. సామాజిక దూరం పాటిస్తూ కనీసం 6 ఫీట్ల దూరం ఉంటూ లిక్కర్ కొనుగోలు చేసుకోవచ్చని కేంద్రం వెసులుబాటు ఇచ్చింది. దీంతో ఇంతకాలం సుక్క లేక తహతహలాడిన ప్రాణాలు మందు షాపుల ముందు ప్రత్యక్షమయ్యాయి.

 

 

 

ఆంధ్రప్రదేశ్ సహా మందు దుకాణాలు తెరుచుకున్న అన్ని రాష్ట్రాల్లోనూ మందు బాబులు హడావిడి చేస్తున్నారు. కొన్నిచోట్ల గుమిగూడి రచ్చ చేస్తుంటే మరికొన్ని చోట్ల మాత్రం క్యూ లైన్ పాటిస్తూ లిక్కర్ కొనుగోలు చేస్తున్నారు. అంతేకాదు కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఆనందంతో గంతులేస్తున్నారు. కొందరైతే పటాసులు కాల్చి మరీ సంబరాలు చేసుకున్నారంటే వాళ్ళ మందు దాహం ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే ఈ రోజు మందు దుకాణాల వద్ద బారులు తీరిన లైన్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. నెట్టింట ఎక్కడ చూసినా ఆ వీడియోలే దర్శనమిస్తున్నాయి.

 

 

 

ఆంధ్ర మొత్తం మందుబాబులు సందడితో  పండగ వాతావరణం నెలకొంది..అనంతపురంలో మద్యం దుకాణాల వద్ద మందుబాబులు క్యూ లైన్లలో నిలుచున్న వీడియో ను సీనియర్ నటుడు నరేష్ అభిమానులతో పంచుకున్నారు..ఆసక్తికరంగా రియాక్ట్ అయ్యారు. ''అనంతపురంలోని కొన్ని వైన్ షాప్స్ తెరిచారు. మొదటి రోజు పాఠశాలకు వచ్చిన పిల్లల్లాగే ఆరు అడుగుల దూరం పాటిస్తూ మన పౌరులు మాత్రమే ఎంత క్రమశిక్షణతో నిలబడ్డారో చూడండి. మన ప్రజలను చూస్తుంటే గర్వంగా ఉంది'' అని ఆయన పేర్కొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: